DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అపహాస్యం చేసుకోవద్దు*

*ప్రభుత్వ ఆదేశాల సత్వర మార్పుల కారణం ఏంటి? *

*అయ్యవారేమి చేస్తున్నారు ఒలకపోసి ఎత్తుకుంటున్నారా*

*పాలకుల అనాలోచిత నిర్ణయాలేనా? అందుకేనా తక్షణ మార్పులు?

*ఏపీ లో ప్రభుత్వ నిర్ణయాలపై బీజేపీ రాష్ట్ర ఈసీ డా. కెవివివి ఆవేదన* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో,

విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  జూన్  25, 2020 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లో విడుదలవుతున్న ప్రభుత్వ నిర్ణయాలను 24 గంటలు మారకుండా మార్పులు చేస్తూ. .ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అపహాస్యం చేసుకోవద్దు అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు డాక్టర్ కెవివివి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ఒక ఆదేశాన్ని

విడుదల చేస్తున్నారని, వెంటనే దానిలో మార్పులు, చేర్పులు చేస్తున్నారని, తద్వారా ప్రజల్లో ప్రభుత్వం పై విశ్వాసం పోతుందన్నారు. తీసుకునే నిర్ణయాలు కొంత ఆలస్యమైనా సరే పూర్తి స్థాయి లో చర్చలు జరిపి ఒకే నిర్ణయం తీసుకుంటే ప్రజలకు ఆందోళన ఉందన్నారు. దాదాపుగా చాలా నిర్ణయాలు ఇలాగే వెంటనే మార్పులు చేస్తున్నారన్నారు. అయితే

దీన్ని ఇతరుల తప్పిదంగా చూపించడం దారుణమన్నారు. 

గత వారం రోజుల్లో ఇచ్చిన ప్రభుత్వ ఆదేశాలను తీసుకుంటే డిగ్రీ విద్యార్థుల పరీక్షలను రద్దు చేసారంటూ మీడియా లో వార్తలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. అయితే 24 గంటలలోగానే ఆబ్బె. . అలాంటిదేమి లేదు, పరీక్షలను రద్దు చెయ్యలేదు, వాయిదా వేషం అంతే  అంటూ మరో సవరణ. దీంతో

విద్యార్థులు సందిగ్ధంలో పడ్డారన్నారు.  

ఇక కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ అంటూ ఏకంగా జిల్లా కలెక్టర్ల నుంచి ఆదేశాలు విడుదలయ్యాయి. ఆ వెంటనే వాటిని సవరిస్తూ. . లాక్ డౌన్ లేదంటూ మరోక ఆదేశం ఇచ్చారన్నారు. ఉదాహరణే, విజయవాడ, తూర్పు గోదావరి జిల్లాలు అన్నారు. ప్రజా రక్షణ కోసమే వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ,

వాటి ని పూర్తి స్థాయిలో సమీక్ష జరిపి ఒక నిర్ణయం తీసుకుంటే. . . గౌరవప్రదంగా ఉంటుందన్నారు. అధికారుల పట్ల ప్రజల్లో ఎంతో ఉన్నతమైన గౌరవ భావం ఉందని, ఇలాంటి ఆదేశాల మార్పు వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. 

దీంతో ప్రజలకు ప్రభుత్వ అధికారుల నుంచి వచ్చే ఆదేశాలు ఏవి అమలు లో ఉంటాయి అనే విషయం తెలియకుండా పోతుంది.

పైగా ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం పూర్తిగా సడలి పోయే అవకాశాలున్నాయి. 

గతం లో సైతం తీసుకున్న నిర్ణయాలను సవరించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఈ తరహాలో పాలనా సాగితే గందరగోళం ఏర్పడడం తప్ప సాధించేది ఉండదు అన్నారు. 

అధికారులు తీసుకునే నిర్ణయాలను ప్రజా ప్రతినిధులు ఎవరైనా ప్రభావితం చేసి

మారుస్తున్నారా అనే అనుమానాలను కూడా డాక్టర్ సత్యనారాయణ వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో అప్పగించిన అధికారాన్ని ఇలాంటి దుందుడుకు చర్యలతో అపహాస్యం చేసుకోవద్దని సూచించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam