DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా కోరల నుంచి మానవాళిని రక్షించు వరహా స్వామీ

*జగన్నాధుని వేడుకున్న పాత్రికీయ జాతీయ కార్యదర్శి గంట్ల*  

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  జూన్  26, 2020 (డిఎన్ఎస్):* ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి రాక్షసుడి నుంచి మానవాళిని కాపాడమని జగన్నాధ స్వామిని ప్రార్ధించినట్టు పాత్రికీయ సంఘం జాతీయ కార్యదర్శి,

విజెఎఫ్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తెలియచేసారు. విశాఖ నగరం లో ని 1 టౌన్ కొత్తరోడ్డు దరి జగన్నాధ స్వామీ ఆలయ వార్షికోత్సవ ఉత్సవాల్లో భాగంగా వరాహ స్వామి అలంకారం లో దర్శనమిస్తున్న స్వామిని శుక్రవారం ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మానవాళి మనుగడకే ప్రశ్నార్ధకం కాకుండా కరోనా మహమ్మారి కోరల నుంచి ఈ

సమాజాన్ని కాపాడాలని, ఈ పోరాటంలో సంపూర్ణ విజయం సాధించేలా ప్రజలందరికీ శక్తిని ప్రసాదించాలని కోరుకున్నట్టు తెలిపారు. 
అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యల నేపథ్యంలో చిన్నారులను, వయో వృద్ధులను దర్శనానికి అనుమతించడం లేదన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam