DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పెట్రోల్ డీజిల్ ధరల పెంపు విరమించుకోవాలి: ఆటో సంఘాలు

*విశాఖ లో ఆటో కార్మిక సంఘాల నిరసనలు* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  జూన్  26, 2020 (డిఎన్ఎస్):* కరోనా కట్టడి తోనే అష్ట కష్టాలు పడుతున్న ఆటో కార్మికుల కుటుంబాలకు, ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణం తగ్గించాలని డిమాండ్ తో నిరసనలు చేసారు. శుక్రవారం

విశాఖపట్నంలోని ఇసుకతోట కూడలి వద్ద ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్ మరియు వర్కర్స్ ఫెడరేషన్, ఎ ఐ టి యూ సి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్స్ యూనియన్లు ధర్నా చేపట్టాయి. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు ప్రభుత్వానికి పలు డిమాండ్లు చేశాయి.

పెంచిన డీజల్ పెట్రోల్ ధరలను తగ్గించాలని
పెట్రోల్ డీజల్ ను జిఎస్టీ పరిధిలోని కి తేవాలని
/> ప్రభుత్వం వేట్ పన్నును రద్దు చేయాలని
దేశమంతా పెట్రోల్ డీజిల్ ధరలు ఒకే విధంగా అమలు చేయాలని
లాక్ డౌన్ కాలంలో జీవన భృతి కోల్పోయిన ఆటో డ్రైవర్ లకు ప్రభుత్వం రూ.10000 ఆర్థిక సాయం చేయాలని
ఆటోలపై భారీగా పెంచిన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం ను 50%  వరకు తగ్గించాలని,
ఆటోలలో 6గురు ప్రయాణికులను అనుమతించాలని,
/> ఆటో డ్రైవర్ మరియు ఆటోలపై పోలీస్ ఈ చలానా కేసులను లను రద్దు చేయాలని,
ప్రభుత్వం పేద ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని,  ఆటో డ్రైవర్ లపై భారం వేసే ప్రభుత్వ విధానాలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. 
ఈ ధర్నా కార్యక్రమంలో నగరం లోని వివిధ ఆటో సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam