DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అంతర్జాతీయ ప్రాజెక్ట్ లను నిలిపేస్తే దేశానికే నష్టం, ఆర్ధిక మంత్రి నిర్మల

*రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం వృద్ధి చెందుతుంది *

*కమర్షియల్ విద్యుత్ రేట్లు భారీగా పెంచడం సరికాదు*

*రాష్ట్రానికి సున్నితంగా చురకలు అంటించిన కేంద్ర మేధావి* 

*వర్చువల్ ర్యాలీ లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో,

విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  జూన్  26, 2020 (డిఎన్ఎస్):* ప్రపంచంలో అత్యంత ప్రజాస్వామ్య దేశమైన భారత్ దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాలని కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ తెలియచేసారు. శుక్రవారం భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ శాఖా నిర్వహించిన మెగా వర్చ్యువల్ ర్యాలీ లో పార్టీ

కార్యకర్తలు, ప్రజలనుద్దేశించి ఆమె ముఖ్య ప్రసంగం చేసారు. దేశం రాజధాని ఢిల్లీ లోని బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి వీడియో ప్రసారం ద్వారా జరిగిన ఈ కార్యక్రమం లో ఆమె మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధానిగా ఏడాది పూర్తి చేసుకున్న శుభ సందర్బంగా దేశం వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా

పర్యవేక్షిస్తున్నారన్నారు. మోడీ ప్రధానిగా మొదటి విడత చేపట్టిన కార్యాచరణ ను విశ్వసించిన దేశం ప్రజలు ఆయనకు రెండో సారి అత్యంత అఖండమైన మెజారిటీ ని ఇచ్చారన్నారు. శతాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న అయోధ్య రామ మందిర నిర్మాణ ఏర్పాటు, కాశ్మీర్ లో కేవలం కొందరికే పరిమితమైన 370 ఆర్టికల్ ను రద్దు చేయడం, పాకిస్తాన్, చైనా వంటి దుష్ట

ముష్కరుల దాడులను త్రిప్పి కొట్టడంలో భారత సైన్యానికి మనోధైర్యాన్ని ఇవ్వడం, మరో ప్రక్క అంతర్జాతీయంగా అన్ని దేశాలతోనూ సత్సంబంధాలు కలిగి ఉండడం వంటివి సాధించారన్నారు. 
ఇక కరోనా కట్టడి సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆర్ధిక సహకారంతో పాటు, వారికి మనో ధైర్యాన్ని ఇవ్వడంలో నరేంద్ర మోడీ పూర్తి విజయం

సాధించారన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా ప్రజల్లో మరింత చైతన్యం కల్గించారన్నారు. కరోనా కట్టడి నష్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 20 లక్షల కోట్లు ఆర్ధిక సాయం ప్రకటించిందన్నారు. ప్రజలకు అందే ప్రతి సాయం కేంద్రం నుంచి వచ్చిందేనని తెలిపారు. 
చిన్న, మధ్య తరహా వ్యాపార వర్గాలకు అండగా కేంద్రం నిలుస్తుందని,

కరోనా నష్టంలో సగానికి కేంద్రం భరోసా ఉంటుందన్న హామీ ఇచ్చారు. అదే విధంగా వీరికి విద్యుత్ ను కేంద్రం ప్రతి యూనిట్ కు రూ. 2 .70 పైసలకు అందిస్తుంటే. . . ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి యూనిట్ కు రూ. 9 కి పైగా వసులు చేస్తున్నట్టు తెలిసిందన్నారు. ఇంతటి ఉంటె వారు ఏ విధంగా వ్యాపారాలు చెయ్యగలరన్నారు. 

ఇక వ్యక్తిగత లాభాల కోసం,

పంతాలు, పట్టింపులు కోసం అంతర్జాతీయ స్థాయి సంస్థలతో జరుగుతున్నా ప్రాజెక్ట్ లను నిలిపి వేయడం ద్వారా భారత దేశం పరువు పోతుందన్నారు. అందులోనూ ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకున్న నిధులతో నడిచే ప్రాజెక్ట్ లను అర్ధాంతరం గా నిలిపివేస్తే భవిష్యత్ లో నిధులు వచ్చే అవకాశాలు ఉండవన్నారు.  పార్టీలు, స్వలాభాలు వేరే విషయాల్లో

చూసుకోవాలి తప్ప, ప్రజా శ్రేయస్సు కోసం జరిగే ప్రాజెక్ట్ ల్లో చూపించకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి చురకలు అంటించారు. 

రాజ్య సభ సభ్యులు జి వి ఎల్ నరసింహారావు, సి ఎం రమేష్, ఆంధ్ర ప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జి సునీల్ దేవ్ ధర్ లు పాల్గొన్న ఈ ర్యాలీ కి కీలక నిర్వహణ ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి చేపట్టారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam