DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎన్నికల సంఘం ముందు నరసాపురం ఎంపీ పార్టీ గుట్టు విప్పెసారు

*కేంద్ర ఎన్నికల కమిషన్ తో నరసాపురం ఎంపీ భేటీ* 

*వైకాపా షోకాజ్ కు ఎలా స్పందించాలో తెలుసుకోడానికే*

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  26, 2020 (డిఎన్ఎస్):* రాష్ట్రంలో సంచలనంగా మారిన నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ

అయ్యారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో వైసీపీ తనకు పంపిన షోకాజ్ నోటీసుల చెల్లుబాటు అంశంపై ఆయన ఎన్నికల సంఘం అధికారులతో చర్చించారు. పార్టీ లెటర్ హెడ్ కాకుండా మరో పేరుతో నోటీసులు వచ్చాయని అభ్యంతరం వ్యక్తం చేశారు.  నోటీసుల లెటర్ హెడ్ పై వైసీపీ అని ఉందని, పార్టీ అసలు పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ

అయినందున తాను ఆ నోటీసులను ఏ విధంగా చూడాలి అనే విషయంలో రఘురామకృష్ణంరాజు ఎన్నికల సంఘం నుంచి స్పష్టత కోరుతున్నారు.

పైగా, ఆ నోటీసులు తనకు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పేరిట వచ్చాయని, ప్రాంతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటాడన్న సందేహాన్ని కూడా ఆయన అధికారుల ముందు వెలిబుచ్చినట్టు సమాచారం. పైగా, ఏ

పార్టీలో అయినా క్రమశిక్షణ సంఘం అనేది ఉంటుందని, కానీ వైసీపీలో అలాంటి కమిటీ లేదని ఆయన అధికారులతో పేర్కొన్నట్టు తెలిసింది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam