DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మాదక ద్రవాల రవాణా, వినియోగానికి దూరం గా ఉండాలి

*13 జిల్లాల ప్రముఖులతో డిజిపి సవాంగ్ వీడియో మీట్.*

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  26, 2020 (డిఎన్ఎస్):* మాదక ద్రవాల రవాణా, వినియోగానికి  ప్రజలందరూ దూరం గా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని

నేపథ్యంలో శుక్రవారం ఆయన వివిధ వర్గాల ప్రముఖులతో వీడియో సమావేశం నిర్వహించారు. దీనిలో సినీ ప్రముఖులు, 13 జిల్లాల యొక్క ఎస్పీలు,  కమిషనర్లతో, ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు విద్యార్థినీ విద్యార్థులతో, సదరు కాలేజీలో యొక్క ప్రొఫెసర్లు ప్రిన్సిపాల్స్ అధ్యాపకులు పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర

ఉన్నత పోలీసు అధికారులు సునీల్ కుమార్, ఏ.రవిశంకర్  మరియు ఉన్నత అధికారులు పాల్గొని ప్రపంచ మానవాళికి పెను భూతంగా పరిమిచిన మాదక ద్రవ్యాల వినియోగం గురించి, ప్రతి సంవత్సరం యువత మాదకద్రవ్యాల వినియోగం వైపు వెళ్లకుండా ఉండేందుకు గాను అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను గురించి వినియోగం గురించి యువతకు అవగాహన

సదస్సులు నిర్వహిస్తున్నట్లు, ఇటువంటి అవగాహన సదస్సుల ద్వారా ఉన్నత చదువులు,చదువుకునే విద్యార్థుల నుండి  స్కూల్ దశలో ఉన్న విద్యార్థులు వరకు మాదక ద్రవ్యాల వినియోగం వలన యువత యొక్క ఆరోగ్యానికి కలిగే నష్టాలను గురించి తెలియజేస్తూ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు గాను, ఈ మాదకద్రవ్యాలకు విద్యార్థులు  ఆకర్షితులు

కాకుండా కాలేజీ స్కూల్ యాజమాన్యాలు మరియు విద్యార్థిని విద్యార్థులు యొక్క తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు విద్యార్థినీ విద్యార్థులు యొక్క ప్రవర్తనను గమనిస్తూ ఉండి, మాదక ద్రవ్యాల  వినియోగించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలియజేసినారు. ఈ సందర్భంగా డిజిపి గారు మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ అనేది ప్రజలకు

సేవ చేయడం ప్రజలకు నమ్మకం భరోసా కల్పించడ. ప్రభుత్వం వారి యొక్క లక్ష్యం మేరకు పోలీసులు విధి నిర్వహణ చేయడం కొరకు, పోలీసు వ్యవస్థలో పలు మార్పులు తీసుకొస్తామని కొంతమంది విద్యార్థిని విద్యార్థులు కోరిక మేరకు డిజిపి గారు ప్రతి నెల ప్రతి కాలేజీలో స్కూల్స్లో మహిళా సమస్యల పట్ల, డ్రగ్స్ వినియోగ పట్ల అవగాహన సదస్సులు

నిర్వహిస్తామని విద్యార్థిని విద్యార్థులు మంచి స్ఫూర్తి భావం కలిగి ఉన్నదానిపై పోలీసు వారి యొక్క సహాయ సహకారాలు అందించుటలో ప్రథమ భాగంలో ఉంటామని, విద్యార్థినీ విద్యార్థులు వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాదక ద్రవ్యాల వినియోగం చేయకుండా మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మీపై మీ తల్లిదండ్రులు

పెట్టుకున్న టువంటి ఆశలను నోము చేయరాదని డిజిపి గారు తెలియజేసినారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ ను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నందు గల కాన్ఫరెన్స్ హాల్లో భౌతిక దూరాన్ని విద్యార్థుల పట్ల కూర్చోబెట్టి పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ కె.ఎన్. నారాయణ్ ఐపీఎస్ గారు వీడియో కాన్ఫరెన్స్ నకు హాజరై నారు. డి.జి.పి  గారి తో ఎస్పీ

గారు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ  భీమవరానికి చెందిన ఒక వ్యక్తి ఈ మధ్యకాలంలో చెన్నై ఎయిర్ పోర్ట్ నుంచి డ్రగ్స్ ను దిగుమతి చేసుకు న్న ఈ విషయంలో భీమవరం ప్రాంతంలో కొంతమందికి, కొన్ని సాంకేతిక నెట్వర్క్ల ద్వారా సరఫరా చేస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వలన సదరు కేసులు అతను ఉపయోగించిన సాంకేతిక

పరిజ్ఞానం డిలీట్ అవుతున్నట్లు దానిపై క్షుణ్ణముగా దర్యాప్తు నిర్వహించినట్లు, పశ్చిమ గోదావరి జిల్లా ను  డ్రగ్స్ రహిత జిల్లాగా చేస్తామని డిజిపి గారి యొక్క సూచనలు సలహాలు పాటిస్తామని ఎస్పీ గారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ కరీముల్లా

షరీఫ్ ఏఆర్ అదనపు ఎస్పీ ఎం మహేష్ కుమార్ పోలీస్ సిబ్బంది హాజరయ్యారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam