DNS Media | Latest News, Breaking News And Update In Telugu

13 న కేంద్ర నౌక రవాణా మంత్రి నితిన్ గడ్కరీ విశాఖ రాక 

విశాఖపట్నం, జులై 9 , 2018 (DNS Online ): కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విశాఖలో ఉపరితల, నౌకారవాణా శాఖల కార్యక్రమాలను సమీక్షించనున్నారు. ఈ నెల 13న జరిగే ఆయన కార్యక్రమాల వివరాలను

పోర్టు చైర్మన్ ఎంటి. కృష్ణబాబు మీడియాకు తెలిపారు. ఈనెల 13 ఉదయం నోవాటెల్ హోటల్లో కేంద్ర మంత్రి గడ్కరీ సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం ఒకటిన్నరకు

మీడియాతో మాట్లాడుతారు. సాయంత్రం కంటెయినర్ టెర్మినల్ లో కొత్త క్రేన్లను ప్రారంభిస్తారు. సాయంత్రం నాలుగున్నరకు ఐరన్ ఓర్ హాండ్లింగ్ కాంప్లెక్సును

ప్రారంభిస్తారు. అయిదుగంటలకు ఫైర్ స్టేషన్ను ప్రారంభించి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో వివిధ

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. ఇందులో సబ్బవరం షీలానగర్ పోర్టు కనెక్టివిటీ రోడ్, ఆనందపురం అనకాపల్లి ఆరులైన్ల జాతీయరహదారి నిర్మాణం, పోర్టు

నాలుగులైన్ల రోడ్డు ప్రారంభోత్సవం, పోర్టులో నిర్మించిన కొత్త బెర్తుల ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాల అనంతరం మీటింగ్ లో మాట్లాడుతారు. అదే రోజు సాయంత్రం

ఆరున్నరకు ఏర్ పోర్టుకు చేరుకుని డిల్లీకి బయలుదేరుతారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam