DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఢిల్లీ పెద్దలతో నర్సాపురం ఎంపీ కృష్ణరాజు అత్యవసర భేటీలు

*స్పీకర్, కేంద్రమంత్రులు రాజ్ నాధ్, కిషన్‌రెడ్డి లతో చర్చ*  

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*
 
*అమరావతి,  జూన్  27, 2020 (డిఎన్ఎస్):* దేశ రాజధాని న్యూ ఢిల్లీ లో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పలువురు కేంద్ర పెద్దలతో అత్యవసరం గా సమావేశమయ్యారు. శనివారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా,  కేంద్ర రక్షణ శాఖా

మంత్రి రాజ్ నాధ్ సింగ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లను వైకాపా ఎంపీ రఘురామ కృష్ణంరాజు కలిశారు. తన భద్రతకు సంబంధించిన విషయంపై కిషన్ రెడ్డితో రఘురామ చర్చించారు. స్పీకర్ కార్యాలయం హోంశాఖ కార్యదర్శికి లేఖ పంపిందన్న విషయాన్ని కిషన్‌రెడ్డికి గుర్తు చేశారు. విషయాలు తెలుసుకుని.. మీ అంశాన్ని పరిశీలిస్తాను అని

రఘురామకు కిషన్‌రెడ్డి తెలిపారు. అంతకముందు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోనూ రఘురామ కృష్ణంరాజు సమావేశం అయ్యారు. పార్టీ షోకాజ్‌ నోటీసు ఇవ్వడంతో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నిన్న లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో కలిసి ‘వైకాపా షోకాజ్‌ నోటీసుల’ అంశంపై రఘురామ

కృష్ణంరాజు మాట్లాడారు.

పార్టీకి.. ప్రభుత్వానికి సంబంధం లేదు: ఎంపీ రాజు

పార్టీని, పార్టీ అధ్యక్షుడిని నేనెప్పుడూ వ్యతిరేకించలేదు అని వైకాపా ఎంపీ రఘురామ 
కృష్ణంరాజు తెలియచేస్తున్నారు. పార్టీని పల్లెత్తు మాట అనలేదు. క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తను. వైకాపా సామాజిక మాధ్యమాల్లో నాపై

దుష్ప్రచారం జరుగుతోందన్నారు. పార్టీకి ప్రభుత్వానికి సంబంధం లేదు. తితిదే భూముల అమ్మకం సరికాదని మాత్రమే చెప్పాను. దీంతో నాపై బెదిరింపులకు దిగుతున్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.  షోకాజ్‌ నోటీసుపై న్యాయనిపుణులను సంప్రదిస్తున్నానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam