DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మృతదేహాన్ని జేసీబీలో తరలించడంపై సోంపేట ఇఓ సస్పెండ్

 *(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూన్ 27, 2020 (డిఎన్ఎస్):*

శ్రీకాకుళం, జూన్ 27 : సోంపేటలో శుక్రవారం మృతిచెందిన ఒక వ్యక్తి భౌతికకాయంను ట్రాక్టర్ లో తరలింపు చేయడంపై సోంపేట మేజర్ గ్రామ పంచాయతీ కార్యనిర్వాహక అధికారి (ఇఓ)తో సహా పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్, ఇద్దరు కంటింజెంట్

వర్కర్ల సస్పెన్షన్ చేసారు.  తహశీల్దార్, ఎం.పి.డి.ఒలకు షోకాజ్ నోటీసులు జారీ చేసారు. ఈ మేరకు శని వారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జె నివాస్ మీడియాతో మాట్లాడుతూ మృతదేహాల తరలింపులో నిర్ధేశిత విధానాలను అవలంభించని అధికారులపై చర్యలు చేపట్టామన్నారు. పలాస సంఘటనలో పలాస మునిసిపల్ కమీషనర్ నాగేంద్ర కుమార్, శానిటరీ

ఇన్స్పెక్ట్ రాజీవ్ లను సస్పెండు చేయగా, సోంపేట ఘటనలో మేజర్ గ్రామ పంచాయతీ కార్యనిర్వాహక అధికారి (ఇఓ) జ్యోతీశ్వర రెడ్డి, పంచాయతీ ట్రాక్టర్ కంటింజెంట్ డ్రైవర్ టెంకా అనిల్, ఇద్దరు కంటింజెంట్ వర్కర్లు ఏ.నెల్లయ్య, ఐ.బెహరా రవి లను సస్పెన్షన్ చేసినట్లు తెలిపారు. తహశీల్దారు ఎస్.గురుప్రసాద్, ఎం.పి.డి.ఓ శివాజీ పాణీగ్రాహిలకు షో

కాజ్ నోటీసులు జారీ చేసామన్నారు. జిల్లాలో అందరు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసామని ఆయన తెలిపారు. జిల్లాలో కరోనా సమయంలో ఆరుగురు మరణించారని, వారికి నెగిటివ్ వచ్చినప్పటికి కరోనా ప్రోటోకాల్ ప్రకారం దహన సంస్కరణలు నిర్వహించిన అనుభవం ఉందని కలెక్టర్ స్పష్టం చేసారు. కరోనా సోకిన వారి పట్ల ప్రజలు వివక్ష చూపరాదని ఆయన

కోరారు. కరోనా ఎవరికైనా రావచ్చని ఆయన పేర్కొన్నారు. కరోనా పేషెంట్లతో వైద్యులు, వైద్య సిబ్బంది, శానిటరీ కార్మికులు ప్రతి రోజు కలుస్తూ సేవలు అందిస్తున్న సంగతి మరచిపోరాదని ఆయన స్పష్టం చేసారు. కరోనా వ్యాప్తి చెందకుండా జిల్లాలో గత మూడు నెలలుగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. జిల్లాకు వస్తున్న వలస

కార్మికులు అందరిని పరీక్షిస్తున్నామని అన్నారు. అయితే సొంత వాహనాలు ద్వారా లేదా ఇతర ప్రాంతాల్లో రైలు దిగి బస్సులు, వాహనాలు ద్వారా వస్తున్న వివరాలు అందించడం లేదని ఆయన అన్నారు. పాజిటివ్ వస్తున్న వారిని ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఆసుపత్రులకు పంపిస్తున్నామని తెలిపారు. 15 మందికి ఇంటి వద్దనే చికిత్స అందిస్తున్నామని, 30

మందికి కోవిడ్ కేర్ సెంటర్ లో చికిత్స అందిస్తున్నామని వివరించారు. జిల్లాకు 30 వేల మందికి పైగా వలస కార్మికులు వచ్చారని కలెక్టర్ అన్నారు. తెలంగాణ నుండి 6610 మంది జిల్లాకు రాగా వారిలో 109 మందికి పాజిటివ్ వచ్చాయని చెప్పారు. గ్రామాల్లో ముమ్మరంగా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. 60 సంవత్సరాలు పైబడిన వారిని, వివిధ

రుగ్మతలతో ఉన్న వారిని ప్రాధాన్యతను ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కనీసం 5 నమూనాలు సేకరించాలని లక్ష్యాన్ని నిర్ధేశించామని పేర్కొన్నారు. పలాసలో 8 ఫీవర్ క్లినిక్ లను ఏర్పాటు చేసామని కలెక్టర్ చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను

సబ్బుతో శుభ్రపరచుకోవాలని పేర్కొంటూ ఇంటిలోనకు వెళ్ళే ముందు కాళ్ళు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam