DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వామన, పరశురామ రూపాల్లో మానవాళి శ్రేయస్సులో.. జగన్నాధుడు

*ఒకే రోజు రెండు అవతారాలు విశాఖలోనే ప్రత్యేకం. ..*

*విశాఖ లో వైభవంగా కొనసాగుతున్న జగన్నాధ ఉత్సవాలు..*
 
*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూన్  28, 2020 (డిఎన్ఎస్):* ప్రస్తుతం ప్రపంచాన్ని కదిలిస్తున్న కరోనా మహమ్మారి రాక్షసుడి బారి నుంచి మానవాళిని రక్షించేందుకు జగన్నాధుడు

వామన, పరశురామ ఒకే సారి రెండు రూపాల్లో అనుగ్రహిస్తున్నాడు. 
 విశాఖపట్నం లోని వన్ టౌన్ కొత్తరోడ్డు లో గల శ్రీ జగన్నాధ స్వామీ ఆలయ వార్షిక ఆషాఢ మసోత్సవాల్లో భాగంగా ఆదివారం జగన్నాధుడు అవతార మహోత్సవాల్లో ఇద్దరు బ్రహ్మచారులు రూపంలో దర్శనమిచ్చాడు. వామనుడు, పరశురాముడు ఇద్దరూ అత్యంత శక్తిమంతులైన బ్రహ్మచారులుగా

పురాణాలూ ప్రకటించాయి. భూమండలం పై అసమానతలు, సాధారణ జన జీవనానికి అవాంతరాలు ఏర్పడిన సందర్భాల్లో అవతరించి, మానవాళిని ఉద్దరించినవారే. ప్రస్తుతం కరోనా మహమ్మారి మన జీవితాలను అతలాకుతలం చేస్తున్న తరుణంలో స్వామి ఈ రూపాల్లో అవతరించి, సమాజానికి హితం కలిగేలా పరోక్షంగా సహకరిస్తుంటారని జగన్నాధ స్వామి ఆలయ అర్చకులు

జగన్నాధాచార్యులు, ఆనందాచార్యులు తెలియచేసారు. 

ఒకే సారి రెండు అవతారాలు విశాఖలోనే . : ఈఓ శిరీష. . .

విశాఖపట్నం కొత్తరోడ్డు లో గల జగన్నాధ స్వామి ఆలయ వార్షిక ఉత్సవాల్లో ప్రతి రోజు ఒక అవతారం లో దశావతార వైభవ ప్రదర్శన తో స్వామి భక్తులకు దర్శనం ఇస్తుంటారని ఆలయ ఇఓ కె. శిరీష తెలియచేసారు. ఈ వేడుకల్లో ఐదవ రోజు

ఉత్సవాల్లో భాగంగా రెండు అవతారాలు ఒకే రోజు అనుగ్రహించడం విశాఖ జగన్నాథునికే ప్రత్యేకం అన్నారు.   

కోవిడ్ 19  రక్షణ నిబంధనల ప్రకారం కారణంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తున్నట్టు తెలియచేసారు. 

మంగళవారం ( జూన్ 25 న) దేశ వ్యాప్తంగా ఆరంభమైన ఉత్సవాలు

గతం లో నిర్వహించిన రీతిలో కాక, ఏకాంతంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖలు ఇచ్చిన ఆదేశాల మేరకు భక్తులను కేవలం దర్శనానికి మాత్రమే అనుమతించడం జరిగిందన్నారు. రక్షణ చర్యలు అన్ని నిబంధనల ప్రకారమే చేపట్టామన్నారు. 

ఆలయ అర్చకులు జగన్నాధాచార్యులు, ఆనందాచార్యుల పర్యవేక్షణలో ప్రత్యేక ఆరాధనలు,

నిత్యా అర్చనలు నిర్వహించిన అనంతరం ఉదయం 6 :30 గంటల నుంచి మత్సావతర అలంకారంలోని  జగన్నాధ స్వామి దర్శనం భక్తులకు కల్పిస్తున్నారు. 
ఈ వేడుకలు జులై 3 వరకూ ఆలయంలోనే ఇదే ప్రాంగణం లో నిర్వహిస్తామన్నారు. భక్తులకు ఉదయం 6 :30 గంటల నుంచి సాయంత్రం వరకూ దర్శనం లభిస్తుందన్నారు. 

ఈ వేడుకల్లో భాగంగా సోమ వారం స్వామీ

ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరామావతారం లో దర్శనం అనుగ్రహించనున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam