DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రభుత్వ భవనాల రంగుల ఖర్చు వైకాపా నుంచే వసూలు చెయ్యాలి

*ప్రభుత్వ భవనాలకు రంగులు తొలగింపు ప్రజా విజయం:* 

*టిడిపి పగో జిల్లా అధ్యక్షులు,  మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి* 

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  28, 2020 (డిఎన్ఎస్):* ప్రభుత్వ భవనాలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన ఆ పార్టీ జండా రంగులను తక్షణం తొలగించమని

కోర్టు ఇచ్చిన తీర్పు ప్రజా విజయమేనని తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి తెలిపారు. ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసారు. ప్రభుత్వ భవనాలకు వైకాపా జండా రంగులు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రజల విజయం అన్నారు. 

ప్రభుత్వ భవనాలు రంగులు వెయ్యడానికి అయినా

ఖర్చు రూ. 1300 కోట్ల కాగా, వాటిని తొలగించడానికి మరొక రూ. 1300 కోట్ల ఖర్చు అన్నారు. మొత్తం రూ. 2600 కోట్లు ను  వైకాపా నుంచే వసూలు చెయ్యాలని డిమాండ్ చేసారు. ఈ నిధులే ఉంటె కరోనా లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన కార్మికులకు పంపిణీ చేయవచ్చన్నారు. 

అధికారం లోకి వచ్చిన నాటి నుంచి వికృత చేష్టలు, విధ్వంస కండలు మొదలు పెట్టారని,

దానిలో ఒక భాగమే ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు వెయ్యడం అన్నారు. పంచాయితీ కార్యాలయాలు, గ్రామా సచివాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్, దిశా పోలీస్ స్టేషన్, రైతు భరోసా కేంద్రాలు, వాటర్ ట్యాంక్ లు, కరెంట్ స్తంభాలు, ఆర్టీసీ బస్సులు, కుప్ప తోట్టులు, చెత్తకుండీలు, ఆఖరికి స్మశాన వాటికలకు కూడా వైకాపా పార్టీ

జండా రంగులు వెయ్యడం అంటే పిచ్చి ముదిరి పాకాన పడిందన్నారు. 

ఈ రంగులు వెయ్యడం పై గుంటూరు జిల్లా పల్లపాడు కు,  విజయనగరం జిల్లా లక్కవరపు కోట పంచాయితీ తలరి గ్రామస్తులు వేర్వేరుగా న్యాయస్థానం లో వ్యాజ్యాలు వేశారన్నారు. వీటిని పరిశీలించిన న్యాయ స్థానాలు తక్షణం వీటిని తొలగించాలని చెప్పినా మొండి వైఖరితో

ఉండడంతో పాటు హైకోర్టు, సుప్రీం కోర్టులకు కూడా వెళ్లడం తొ అక్కడ కూడా ప్రభుత్వానికి మొట్టికాయలు పడ్డాయన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam