DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఘనంగా 14వ జాతీయ గణాంక దినోత్సవం: సిపిఒ మోహనరావు

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  జూన్  29, 2020 (డిఎన్ఎస్):* గణాంకాల చరిత్ర కౌటిల్యుని కాలం నుండి మహాలనొబిస్, సి ఆర్ రావు వరకు తెలిసిందేనని, చరిత్రకు చప్పట్లు కొట్టామని శ్రీకాకుళం   ముఖ్య ప్రణాళిక అధికారి యం.మోహనరావు పేర్కొన్నారు. 14వ జాతీయ గణాంక దినోత్సవం సందర్భంగా స్థానిక ముఖ్య

ప్రణాళిక అధికారి సమావేశ మందిరంలో జాతీయ గణాంక దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. తొలుత ప్రొఫెసర్ పి.సి. మహాలనొబిస్ చిత్రపటానికి పూలమలను వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సి.పి.ఓ మాట్లాడుతూ గణాంక శాస్త్రం వృద్ధిని అంచనా వేయలేమని చెప్పారు. ప్రస్తుత కాలానికి, రాబోయే కాలానికి  పరిశీలించి

 శాస్త్రానికి, శాఖకు సశాస్త్రీయ సూచనలు ఇచ్చే ప్రయత్నం చేయగలిగిన నాడే మనం నేర్చుకున్న విద్యకు  న్యాయం చేసినట్లవుతుందని ఆయన స్పష్టం చేసారు. గణాంకాల విషయంలో భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలో ఒకే ధ్యాసలో ఉండకూడదని, నేడు మనం జీవిస్తున్న అది నిన్నటి చరిత్ర చూపిన పాఠాలని గుర్తించాలని చెప్పారు. అలాగే  రేపటి సమాజం పై

అంచనాలతో వివేకవంతమైన జీవితం గడపాలంటే కేవలం శాస్త్రాన్ని చదివి ఊరుకోకుండా, సంఖ్యా శాస్త్రంతో సహజీవనం చేయాలని వివరించారు. 
         గణాంకాలు సేకరణ, విశ్లేషణ, అంచనాల పరిధి దాటి నూతన సాంకేతిక ప్రపంచం వైపు అడుగులు వేస్తుందని దీన్ని ప్రతీ అధికారి గమనించాలని సూచించారు. కొన్ని సైన్సులకు లాబ్.. ప్రయోగశాల నాలుగు

గోడల మధ్యే హద్దు అయితే  గణాంక  శాస్త్రం కు మాత్రం ఎనిమిది దిక్కుల నడుమనున్న ప్రపంచం మొత్తం ప్రయోగశాలే! అని కితాబిచ్చారు. కాబట్టి ప్రతీ పనిని శాస్త్రీయంగా విశ్లేషించి, స్వీయ వివేకమూ జోడించి వ్యక్తికీ, సంఘానికీ సులువుగా ఉపయోగపడేలా మరింత సులభతర రీతిలో సాంఖ్యక శాస్త్రం కొత్తరూపు దిద్దుకోవాలని ఆయన అధికారులకు

పిలుపునిచ్చారు. నిన్న, మొన్నటి అంకెలు కాకుండా ప్రస్తుతం ఏమికావాలో తెలుసుకొని నడుచుకునేలా ప్రణాళిక శాఖ పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. 

ఈ కార్యక్రమంలో అధికారులు బద్రీనాథ్ , సాలెంరాజు,  ఏ.పి.ఇ.యస్.యస్.ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. శశిభూషన్ రావు, ఇతర ఉద్యోగులు డి. రవికుమార్, ఎం.వి. వరహాల రావు, కె. అప్పారావు, కె.

మురళీధర్, కె. మురళీకృష్ణ, యం.రవి, ఏపిఎన్.జి.ఓ అసోసియేషన్ పట్టణ ఉపాధ్యక్షులు బి. పూర్ణచంద్రరావు మరియు మహిళ ఉద్యోగులు వి. సుజాత కుమారి, డి. నరసమ్మ, వి. శ్రీదేవి, హరిత, విజయకుమారి, ఆర్.డి.కె.ప్రసాద్, దనుంజయ్, యోగి తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam