DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నెల్లూరు పర్యాటక శాఖా లో మహిళా ఉద్యోగిని పై రాడ్ తో దాడి

*మాస్క్ పెట్టుకుమన్నందుకేనా పై అధికారి దాడి చేసింది?* 

*డిప్యూటీ మేనేజర్ భాస్కర్ తీరు పై సర్వత్రా నిరసనలు*

*ఆ ఉద్యోగి పై చర్య తీసుకోవాలి : బీజేపీ రాష్ట్ర ఈసీ  డా. కెవివి డిమాండ్*

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  30, 2020 (డిఎన్ఎస్):* కరోనా మహమ్మారి

పెచ్చుమీరుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ముఖానికి మాస్క్ ధరించాలి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించిన విషయం తెలిసిందే. నెల్లూరు లోని ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖా కు చెందిన టూరిజం హోటల్  కార్యాలయంలో ఒక కాంట్రాక్ట్ మహిళ ఉద్యోగిని  అందరినీ మాస్క్ పెట్టుకుని రావాలని కోరినందుకు ఆగ్రహించిన అధికారి

ఆమెపై రాడ్ తో దాడి చేసి అతికిరాతకంగా కొట్టినట్టు తెలుస్తోంది. అయితే అసలు కారణం అదా కదా అనేది తెలియాల్సి ఉంది. భౌతిక దాడి జరగడం వాస్తవం, కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. 

వివరాల్లోకి వెళితే. . .

శనివారం నెల్లూరు లోని ఏపీ టూరిజం శాఖా కు చెందిన టూరిజం హోటల్ కార్యాలయంలో 
ఉషారాణి అనే కాంట్రాక్ట్

మహిళా ఉద్యోగిని తనతో మాట్లాడడానికి వచ్చిన డిప్యూటీ మేనేజర్ భాస్కర్ ని మాస్కు పెట్టుకుని మాట్లాడాలని చెప్పినందుకే  దాడి చేసారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. మరణ ఆయుధాలు తో దాడి చేసిన ఘటనపై ఆ  ఉద్యోగిని, ఆమె సహచర సిబ్బంది  నెల్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

ఈ దాడి గిరిజన వైనం

మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరా లో రికార్డ్ అయ్యింది. సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఆ వీడియో ప్రకారం భాస్కర్ ఒక్కడే ముఖానికి మాస్క్ లేకుండా ఉన్నాడు. మిగిలిన ఉద్యోగులందరూ మాస్క్ లు ధరించి ఉన్నారు. 


యథారాజా తధా ప్రజా. . .: బీజేపీ రాష్ట్ర ఈసీ  డా. కెవివి  . .

ఈ ఘటన పై స్పందిస్తూ తక్షణం ఆ ఉద్యోగిపై

కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ కెవివివి సత్యనారాయణ డిమాండ్ చేసారు. 
రాష్ట్రంలో మాస్క్ ధరించని వారికి రూ. 100 ఫైన్ వేస్తున్నట్టు డిజిపి ఇప్పడికే ప్రకటించడం జరిగిందని, ఇది కేవలం సామాన్య ప్రజలకు మాత్రమే ప్రస్తుతానికి అమలు జరుగుతోందన్నారు. 
 ప్రభుత్వ అధికారులు, ప్రజా

ప్రతినిధులు, సాక్షాత్తు మంత్రులు సైతం చాలా చోట్ల బహిరంగంగా తిరుగుతున్నా సమయాల్లో మాస్క్ లు ధరించడం లేదని మండిపడ్డారు.  ఈ దృశ్యాలు మీడియా పరంగా అందరికీ కనిపిస్తున్నాయన్నారు. 

ప్రజలకు మార్గదర్శకంగా ఉండవలసిన ప్రజా ప్రతినిధులే  గతి తప్పితే. . .ఇక ప్రభుత్వ అధికారులు ఎలా పాటిస్తారు అని అయన

ప్రశ్నించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam