DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లాక్ డౌన్‌తో లక్షలాది మంది ప్రాణాలు కాపాడగలిగాం: మోదీ

*కంటైన్మెంట్ జోన్లపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి*

*గీత దాటినా వారి తీరు మార్చాల్సిన అవసరం ఉంది* 

*కరోనాతో పోరాటం చేస్తూ అన్ లాక్ 2. 0 లోకి ప్రవేశించాం* 

*ఒక దేశ ప్రధాని మాస్కు పెట్టుకోలేదని రూ.13 వేలు ఫైన్ వేశారు.* 

*ప్రజా ప్రతినిధులు తప్పని సరిగా ముఖానికే మాస్క్

పెట్టుకోవాలి*
 
*జాతినుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం*

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  30, 2020 (డిఎన్ఎస్):* భారత్ లో కరోనా విజృంభిస్తున్న తోలి దశలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేసి లక్షలాది మంది ప్రాణాలు కాపాడగలిగామని భారత ప్రధాన మంత్రి నరేద్ర మోడీ

తెలిపారు. మంగళవారం జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటైన్మెంట్ జోన్లపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న నిబంధనలను సరిగ్గా పాటించని వారి తీరు మార్చాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. ప్రజా శ్రేయస్సు కోసం ఐదు దశల్లో లాక్ డౌన్ ను అమలు

చేశామని, కానీ అన్ లాక్ 1.0 ప్రారంభమైనప్పటి నుంచి కేసులు మళ్లీ పెరుగుతున్నాయని తెలిపారు.  ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. వాతావరణం మారుతున్నందున మీరందరూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు. 

కరోనాతో చనిపోతున్నవారి సంఖ్యను చూస్తే . . ప్రపంచంలో భారత్ పరిస్థితి మెరుగ్గా

ఉందని, అయితే ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణలోనే ఉండాలన్నారు.  సరైన సమయంలో లాక్ డౌన్ పెట్టడం వల్ల కరోనా అదుపులో ఉందని తెలిపారు.   

కొద్ది రోజుల నుంచి మాస్కులు వేసుకోవడంలో ప్రజల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందని,  లాక్ సమయంలో నిబంధనలను చాలా కఠినంగా పాటించారని తెలిపారు.

పరిస్థితి అదుపు చెయ్యడం

రాష్ట్రాల చేతిలోనే. .. 

రాష్ట్రాల్లో ప్రజలు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నందున, వాటిని అదుపు చెయ్యడం రాష్ట్ర ప్రభుత్వాల చేతిలోనే ఉందన్నారు. మళ్లీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలను కఠినంగా చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.  

ఇటీవలే ఒక దేశ ప్రధాని మాస్కు పెట్టుకోలేదని రూ.13 వేలు జరిమానా

విధించారని గుర్తు చేసారు. మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే స్ఫూర్తితో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. నిబంధనలు జారీ చేసే ప్రభుత్వ అధినేతలు, ప్రజా ప్రతినిధులు, వాటిని అమలు చేసే అధికారులు ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ముఖానికి మాస్క్ లు ధరించాలని సూచించారు. 

లాక్ డౌన్ సమయంలో 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18

వేల కోట్ల నగదు జమ చేశామని, జులై నుంచి నవంబర్ వరకు 80 కోట్ల మందికి రేషన్ ఇస్తాం అని తెలిపారు. 5 కిలోల బియ్యంతోపాటు కిలో పప్పు ఇస్తాం అని తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam