DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శయన ఏకాదశి నాడు శేషపాన్పు లో జగన్నాధుని దర్శనం 

రెండు రోజుల పాటు అవతార దర్శనం: ఈఓ శిరీష  

2 తో జగన్నాధ వార్షిక ఉత్సవాలు ముగింపు . . . .
 
*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 01, 2020 (డిఎన్ఎస్):* ఆషాఢ శుద్ధ ఏకాదశి శ్రీమహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్లే ఎంతో పవిత్రమైన రోజు కావడంతో దీన్ని శయన ఏకాదశి అని పేరు. విశాఖనగరం లోని

కొత్తరోడ్డు జగన్నాధ స్వామి ఆలయంలో వార్షికోత్సవాల్లో భాగంగా ఈ శయన ఏకాదశి పర్వదినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ అర్చకులు ఆనందాచార్యులు తెలియచేసారు. బుధవారం ఈ వేడుకల్లో భాగంగా గత ఏడు రోజుల పాటు వివిధ దశావతార అలంకారాల్లో అనుగ్రహించిన జగన్నాధుడు శేష పాన్పు పై పవళించి ఆ వైభవాన్ని భక్తులకు దర్శన

బాగ్యాన్ని కల్పించాడు.  
ప్రతి ఏటా వేలాది గా భక్దులు ఈ వేడుకల్లో పాల్గొని, స్వామి అనుగ్రహానికి పాత్రులవుతుంటారని ఆలయ ఈఓ కె. శిరీష తెలియచేసారు. ప్రతి ఏడాది భక్తులకు శేషపాన్పు అలంకారంలో రెండు రోజుల పాటు దర్శనం కల్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అదే విధంగా ఈ ఏడాది కూడా భక్తులకు శేషాపంప్యూ గురువారం కూడా

లభిస్తుందన్నారు. 
బుధవారం ఉదయం 5 గంటలకు స్వామికి అలంకారం చేసి, ప్రత్యేక ఆరాధనలు చేసిన అనంతరం 6 :30 గంటల నుంచి భక్తులను అనుమతించమన్నారు. బుధవారం స్వామిని దర్శించిన వారిలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పారిశ్రామికవేత్త మావూరి వెంకట రమణ కుటుంబ సభ్యులతో సహా ఆలయానికి విచ్చేసారు.  

కోవిడ్ 19  రక్షణ నిబంధనల

ప్రకారం కారణంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తున్నట్టు తెలియచేసారు. 

ఒకే సారి రెండు అవతారాలు 5 వ రోజు ప్రత్యేకత : ఈఓ శిరీష. . .

విశాఖపట్నం కొత్తరోడ్డు లో గల జగన్నాధ స్వామి ఆలయ వార్షిక ఉత్సవాల్లో ప్రతి రోజు ఒక అవతారం లో దశావతార వైభవ ప్రదర్శన తో స్వామి

భక్తులకు దర్శనం ఇస్తుంటారని ఇఓ కె. శిరీష తెలియచేసారు. ఈ వేడుకల్లో ఐదవ రోజు ఉత్సవాల్లో భాగంగా రెండు అవతారాలు ఒకే రోజు అనుగ్రహించడం విశాఖ జగన్నాథునికే ప్రత్యేకం అన్నారు. ఈ భాగ్యం ఈ ఏడాది ఆదివారం భక్తులకు కల్గిందన్నారు. జగన్నాధుడు అవతార మహోత్సవాల్లో ఇద్దరు బ్రహ్మచారులు రూపంలో దర్శనమిచ్చాడు. వామనుడు, పరశురాముడు

ఇద్దరూ అత్యంత శక్తిమంతులైన బ్రహ్మచారులుగా పురాణాలూ ప్రకటించాయి. భూమండలం పై అసమానతలు, సాధారణ జన జీవనానికి అవాంతరాలు ఏర్పడిన సందర్భాల్లో అవతరించి, మానవాళిని ఉద్దరించినవారే. ప్రస్తుతం కరోనా మహమ్మారి మన జీవితాలను అతలాకుతలం చేస్తున్న తరుణంలో స్వామి ఈ రూపాల్లో అవతరించి, సమాజానికి హితం కలిగేలా పరోక్షంగా

సహకరిస్తుంటారని జగన్నాధ స్వామి ఆలయ అర్చకులు జగన్నాధాచార్యులు, ఆనందాచార్యులు తెలియచేసారు. 

పూర్తి ఏకాంతంలోనే. . : 
మంగళవారం ( జూన్ 25 న) దేశ వ్యాప్తంగా ఆరంభమైన ఉత్సవాలు గతం లో నిర్వహించిన రీతిలో కాక, ఏకాంతంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖలు ఇచ్చిన ఆదేశాల మేరకు భక్తులను కేవలం దర్శనానికి

మాత్రమే అనుమతించడం జరిగిందన్నారు. రక్షణ చర్యలు అన్ని నిబంధనల ప్రకారమే చేపట్టామన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam