DNS Media | Latest News, Breaking News And Update In Telugu

108, 104 వాహనాలకు రాజమహేంద్రవరంలో ఘన స్వాగతం 

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూలై 01, 2020 (డిఎన్ఎస్):* పేద ప్రజలకు సత్వర వైద్య సదుపాయాలు సకాలంలో అందజేసే విధంగా అధునాతన సదుపాయాలతో ఏర్పాటుచేసిన 108,  104 వాహనాలును రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం విజయవాడలో ప్రారంభించగా తూర్పు గోదావరి జిల్లాకు కేటాయించిన వాహనాలు

ఈరోజు అనగా బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరం చేరుకున్నాయి. రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి ప్రారంభంలో కోటిపల్లి బస్టాండ్ వద్ద వాహనాలకు రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా,  సిటీ రూరల్,  నాయకులు హారతులు ఇచ్చి ఘన స్వాగతం ఏర్పాటు చేశారు.  జక్కంపూడి విజయలక్ష్మి వాహనాలకు

రిబ్బన్ కట్ చేశారు. ఈ వాహనాలకు కాకినాడ వెళ్లడానికి జక్కంపూడి రాజా జెండా ఊపారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇచ్చి పేద ప్రజలకు సకాలంలో వైద్యాన్ని అందించే విధంగా చేపట్టిన

కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 108 మరియు104 వాహనాలు అన్ని వైద్య సదుపాయాలు, హంగులతో ఏర్పాటు చేస్తూ 1061 వాహనాలను ఈరోజు ప్రారంభించారని తెలిపారు. దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదాల ప్రాంతం  నుండి 15 నిమిషాల్లో సరి అయిన ఆసుపత్రికి చేర్చే విధంగా ఈ వాహనాల రూపకల్పన చేశారన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు 108 వాహనాలు 39, 104

వాహనాలు 62, మొత్తము 101 వాహనాలను కేటాయించారన్నారు. జిల్లాలో మెడికల్ కాలేజీలు కూడా ఏర్పాటుకు ముఖ్యమంత్రి చర్యలుచేపట్టారని ఈ సందర్భంగా రాజా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, సిటీ నియోజకవర్గ కోఆర్డినేటర్ శి ఘాగోళ్ల పు శివ రామ సుబ్రహ్మణ్యం, నందెపు శ్రీనివాస్,  షర్మిలారెడ్డి,

నక్కా  శ్రీ నగేష్, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ కోమల, జిల్లా ఆసుపత్రి కోఆర్డినేటర్ డాక్టర్ రమేష్ కిషోర్, రెండవ పట్టణ సీఐ బి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam