DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆర్ టి సి ఆధ్వర్యవం లో డ్రైవింగు స్కూల్ మంజూరు

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 02, 2020 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ ప్రజా రవాణా శాఖకు హెవీ వెహికల్ డ్రైవింగు స్కూల్ మంజూరు అయిందని శ్రీకాకుళం  డిప్యూటి చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జి.వరలక్ష్మి తెలిపారు. ఈ మేరకు గురు వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ శ్రీకాకుళంకు హెవీ వెహికల్

డ్రైవింగు స్కూల్ మంజూరు పట్ల సంతోషం వ్యక్తం చేసారు. డ్రైవింగు స్కూల్ కార్యకలాపాలు వెంటనే ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఆసక్తిగల అభ్యర్ధులు శ్రీకాకుళం డిపో -1 కార్యాలయంలో హెవీ వెహికల్ డ్రైవింగుకు దరఖాస్తు చేయవచ్చని ఆమె పేర్కొన్నారు. 40 రోజుల పాటు శిక్షణ ఉంటుందని ఇందులో 16 రోజులు బోధనా తరగతులు ఉంటాయని ఆమె చెప్పారు. 16

రోజులు బస్సుపై ప్రాక్టికల్ శిక్షణ ఇస్తామని వరలక్ష్మి చెప్పారు. 40 రోజుల శిక్షణా కాలంలో విధిగా 32 రోజుల హాజరు ఉండాలని ఆమె స్పష్టం చేసారు. శిక్షణ కాలం పూర్తి చేసుకున్న అభ్యర్ధులకు డ్రైవింగు సర్టిఫికేట్ జారీ చేస్తామని తెలిపారు. హెవీ డ్రైవింగు శిక్షణకు అభ్యర్ధులకు 20 సంవత్సరాలు నిండి తగిన శరీర దారుఢ్యం కలిగి ఉండాలని

ఆమె పేర్కొన్నారు. కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, లైట్ మోటార్ వెహికల్ (ఎల్.ఎం.వి) లైసెన్సు వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకుని, హెవీ వెహికల్ ఎల్.ఎల్.ఆర్ డ్రైవింగు లైసెన్సు కలిగి ఉన్న అభ్యర్ధులు అర్హులన్నారు. శిక్షణ పొందుటకు అభ్యర్ధులు జి.ఎస్.టితో సహా రూ.15 వేలు ఫీజు చెల్లించాలని అన్నారు. ఈ ఫీజును రెండు విడతలుగా

చెల్లించే అవకాశం ఉందని చెప్పారు. ఆగష్టు 31వ తేదీ లోపు పేర్లు నమోదు చేసుకున్న అభ్యర్ధులకు మాత్రమే ఫీజును రూ.23,600 నుండి రూ.15 వేలుకు తగ్గించడం జరిగిందని చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. వివరములకు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ – 995925605, డిపో మేనేజర్, శ్రీకాకుళం-1 - 9959225608, అసిస్టెంట్

మేనేజర్ (ట్రాఫిక్) 7382921647 నంబర్లకు సంప్రదించ వచ్చని ఆమె సూచించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam