DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎక్స్ నేవెల్ డాక్ యార్డ్ అప్రెంటిస్ రిలే దీక్షకు ఆమ్ ఆద్మీ సంఘీభావం

అప్రెంటిస్ à°² దీక్షకు ఆమ్ ఆద్మీ సంఘీభావం . . . . . 

విశాఖపట్నం, జూలై 10, 2014  (డిఎన్‌ఎస్‌) : సుమారు 45 రోజుల నుండి చేస్తున్న ఎక్స్ నేవెల్ డాక్ యార్డ్ అప్రెంటిస్ రిలే

నిరాహారదీక్షలకు ఆమ్ఆద్మీ పార్టీ మద్దతు తెలిపారు. సోమవారం నాడు ఆప్ పార్టీ విశాఖ జిల్లా కన్వీనర్ సీతల్ మదన్ దీక్షా శిబిరంలో కూర్చుని తమ సంఘీభావం తెలిపారు. ఈ

సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తీరు చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. సుమారు 45రోజుల నుండి అప్రెంటిస్ లు న్యాయ పోరాటం చేస్తుంటే డాక్

యార్డ్ యాజమాన్యం పట్టించుకోకుండా తమపని తాను చేసుకుంటూ మాకు సంబంధo లేదులే అనే ధోరణి లో వ్యవరిస్తున్న తీరును ఆమె తీవ్రంగా ఖండించారు. కోర్ట్ తీర్పులను సైతం

లెక్కచేయకుండా నేవెల్ అధికారులు తప్పుడు పద్దతిలో కాసులకు కక్కుర్తి పడి అక్రమ నియామకాలు చేస్తూ ఎంతో పేరు ప్రత్యేకత ఉన్న రక్షణ రంగానికే మాయని మచ్చ

తీసుకొచ్చే విధంగా అధికారులు అవినీతికి పాలుపడ్డారని ఆమె ఆరోపించారు. ఇకనైనా తప్పుడు నియామకాలకు స్వస్తి చెప్పి కోర్ట్ తీర్పులను అమలు చేసి, పాత SRO/150 ద్వారానే

నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇన్ని రోజుల నుండి వీరు న్యాయ పోరాటం చేస్తుంటే ఇంతవరకు ఒక్క అధికారిగాని దీక్ష శిబిరాన్ని వద్దకు వచ్చి సమష్యను అడిగి

తెలుసుకుని పరిష్కారదిశగా ప్రయత్నం చేయకపోవడం చాలా బాధాకర విషయం అన్నారు. తక్షణమే అప్రెంటిస్ లకు ఉద్యగాలు కల్పించాలని, లేని పక్షంలో ఈ ఉద్యమం మరంత ఉదృతం

చేస్తామని, అవసరం అయితే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు వెనకాడేది లేదన్నారు. ఈ దీక్షలో రమేష్, వెంకట్రావు, చందు, కిరణ్, దినేష్, శ్రీను,సూరజ్ తదితరులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam