DNS Media | Latest News, Breaking News And Update In Telugu

4 న సింహగిరి ప్రదక్షిణ రద్దు, చేస్తే కఠిన చర్యలు:

*కరోనా కాఠిన్యానికి 32 కి మీ ల ప్రవిత్ర యాత్ర పై వేటు.*  

*ప్రదక్షిణ రద్దు అయినా పోలీస్ లకు పహారా మాత్రం తప్పడం లేదు*

*తొమ్మిది శతాబ్దాల్లో తొలిసారి గిరి ప్రదక్షిణ నిలిపివేత. . .*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 03, 2020 (డిఎన్ఎస్):* ఎంతో ప్రాశస్త్యమైన

సింహాచల క్షేత్ర గిరి ప్రదక్షిణ సైతం కరోనా కాఠిన్యానికి బలి అయిపొయింది. ఈ నెల 4 న ప్రారంభం కావలసిన సింహాచల క్షేత్ర గిరి (32 కిలోమీటర్ల) పరిక్రమణ ద్వారా నగర వీధులన్నీ శ్రీ వరాహ లక్ష్మి నృసింహుని నామస్మరణతో పులకించవలసి ఉంది. అయితే భక్తుల ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని దేవాలయ , ప్రభుత్వ అధికారులు ఈ ఏడాది ఈ యాత్రను

నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. ఈ యాత్రలో లక్షలాదిగా భక్తులు పాల్గొని, స్వామిని దర్శించుకునేందుకు సింహాచలం క్షేత్రానికి రావడం జరుగుతుంది. విశాఖ నగర వీధుల్లో ప్రయాణిస్తూ సాగర తీరంలో సముద్ర స్నానాలు చేసి మరీ యాత్ర కొనసాగించడం జరుగుతుంది. ఈ సారి వీటిని కూడా రద్దు చేసారు.

ప్రసుతం ప్రతి ఒక్కరూ

కనీస దూరం పాటిస్తూ ప్రదక్షిణ చెయ్యడం సాధ్యపడదు కనుక, ఈ ఏడాదికి రద్దు చేస్తున్నారు ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా యాత్ర చేసేందుకు సిద్ధపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హెచ్చరించారు. 

అదే విధంగా మొక్కులు, దర్శనాలకు అనుమతులు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.

నిబంధనలు ఉల్లంఘించి గిరిప్రదక్షిణ చేసినవారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తారు.

ఈ యాత్రలో పాల్గొనే భక్తులకు సేవచేసుకునేందుకు వేలాదిగా స్వచ్చంద సేవ సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు, వైద్య బృందాలు, ఉచితంగా తమ సేవలను అందించే ప్రయత్నం చేస్తుంటారు. భారీ ఎత్తున పోలీస్ బలగాలు సైతం వీరికి రక్షణ కల్పిస్తుంటాయి.

అయితే ఈ ఏడాది ఈ యాత్ర రద్దును భక్తులు సైతం స్వాగతిస్తున్నారు. 

ప్రతి సారి వీరికి రక్షణ కల్పించేందు కు భారీ ఎత్తున పోలీసులు పహారా లో ఉంటారు. అయితే ఈ ఏడాది ప్రదక్షిణ రద్దు చేసినా కూడా పోలీస్ లకు పహారా మాత్రం తప్పడం లేదు, అయితే ఈసారి భక్తులు యాత్ర చెయ్యకుండా చూడడం వీరి విధి.

చరిత్ర పుటల్లో . . .

వెయ్యేళ్ళ క్రితం చక్రవర్తి కులోత్తుంగ చోళ దేవ ( 1070 – 1122 AD ) దక్షిణ భారత దేశంలో తమ చోళ రాజ్యాన్ని విస్తరిస్తూ ఉత్తరాంధ్రలో కూడా జెండా పాతాడు. అప్పట్లో తన రాజ్యంతో పాటు వైష్ణవాన్ని విస్తరింపజేస్తున్న సమయంలో దొరికిన ఒక స్థంభం ఆ తరువాత కాలంలో దశల వారీగా ఇపుడు మనం చూస్తున్న సింహాచలం ఆలయ సముదాయం రూపు దిద్దుకోడానికి బాటలు

వేసింది. 

ఈ తొమ్మిది శతాబ్దాల కాలంలో సింహాచలం ఆలయ చరిత్రలో ఎన్నో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశేషాలు, రాజకీయాలు, గాధలు, కల్పనలు, తగాదాలు, వివాదాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి, కొన్ని వందల ఏళ్లుగా నిరంతరాయంగా సాగుతున్న గిరిప్రదిక్షణ కరోన వైరస్ మూలంగా రద్దు కావడంకు కూడా ఆ చరిత్రలో చోటు దక్కుతుంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam