DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గాల్వన్ లోయ క్షతగాత్రులైన వీరులతో ప్రధాని మోడీ భేటీ

*భారత్ మాత కి జై నినాదం తో మారుమ్రోగింది సైనిక చికిత్స శిబిరం* 

*లడక్ పర్యటనలో నిము లో ఆసుపత్రిలో స్ఫూర్తి ప్రసంగం* 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 03, 2020 (డిఎన్ఎస్):* అత్యంత బలవంతమైన దేశంగా పేరుపొందిన భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లడఖ్ లోని భారతీయ

సైనిక శిబిరాన్ని సందర్శించారు. శుక్రవారం వచ్చిన నిము లోని సైనిక శిబిరం లో యువతీ యువకులైన సైనికులను ఉద్దేశించి ఉత్తేజ పూరిత ప్రసంగం చేసారు. అనంతరం ఇటీవల గాల్వన్ లోయ లో చైనా సైనికులు చేసిన ఘాతుక ఘటనలో తీవ్రంగా గాయాల పాలై నిము ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారత సైనికులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వారిని

అభినందించారు. భారత మాత, మిమ్మల్ని కన్నతల్లి కి ఈ దేశ ప్రజలు రుణపడిపోయి ఉన్నారన్నారు. ఎంతో దేశభక్తి ఉంటె తప్ప సైన్యం చేరేందుకు సిద్ధపడ్డారని, అలాంటిది శత్రుసైన్యానికి ఎదురెళ్లి మరీ పోరాట పటిమను చూపుతున్న భారతీయ సైనికులకు మొత్తం భారత దేశము అండగా నిలుస్తుందని, త్వరితగతిన ఆరోగ్యాన్ని పొందాలని ప్రధాని ఆశించారు.

అంతకుముందు ప్రధాని మోడీ సైనిక ఆసుపత్రి ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా సైనికులంతా భారతమాతాకీ జై అంటూ నినాదాలు చేసారు. ప్రధాని స్ఫూర్తిదాయక ప్రసంగం క్షతగాత్రులైన సైనికుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ప్రధాని వెంట భారత ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam