DNS Media | Latest News, Breaking News And Update In Telugu

50 వేల మందికి పైగా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగ పత్రాలు జారీ

*ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సేవలు విధులు ప్రారంభం*

*వీడియో కాన్ఫరెన్సులో లబ్ధిదారులతో సీఎం మాటామంతి *

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూలై 03, 2020 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా సుమారు 50 వేల మందికి పైగా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగ నియామక పత్రాలు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జారీ చేసారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో సమావేశం ద్వారా ఉద్యోగార్థులతో మాట్లాడారు. ఈ సందర్బంగా అయన తెలిపిన అంశాలు:. .

ఈరోజు ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్ (ఆప్కాస్‌ ) ప్రారంభం కావడం అన్నది నిజంగా ఒక వ్యవస్థలో మార్పు తీసుకురావడంలో మరో

అడుగు అన్నారు. 
నా సుదీర్ఘ పాదయాత్రలో అన్ని ప్రాంతాలు తిరిగాను. 14 నెలల పాటు 3648 కి.మీ నడిచానన్నారు. అప్పుడు ప్రతి చోటా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల బాధలు విన్నాను. చూశాను. నేడు అమలు చేశానన్నారు. 
ఉద్యోగం కోసం లంచంతో పాటు, మళ్లీ జీతం తీసుకోవడానికి కూడా లంచం ఇవ్వాల్సి వస్తోందని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు

చెప్పారు, అంతే కాకుండా కాంట్రాక్ట్‌లో ఒక జీతం చూపి, అంత కంటే తక్కువగా చేతికి ఇస్తున్నారని ఆ ఉద్యోగులు ఆవేదన చెందారు.
– ఔట్‌ సోర్సింగ్‌లో కొందరికి మేలు చేయడం కోసం కాంట్రాక్టర్లను తీసుకువచ్చారు. కొన్ని చోట్ల నాయకులు కాంట్రాక్టర్లుగా మారారన్నారు. 

ఆలయాల్లో పారిశుద్ధ్య కాంట్రాక్ట్‌ పనులు గతంలో

రూ.6 లక్షలుంటే, దాన్ని ఏకంగా రూ.30 లక్షలకు పెంచి, భాస్కరనాయుడుకు ఇచ్చారు. ఆయన చంద్రబాబుకు బంధువు గా తేలిందన్నారు. 

ఈ వ్యవస్థ మార్చాలని, పారదర్శకత తేవాలని, ఉద్యోగులకు మెరుగైన జీతాలు ఇవ్వాలని, ఎవరికీ లంచాలు ఇవ్వకుండా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉండాలని, ఎక్కడా వివక్షకు తావుండ కూడదని

భావించామన్నారు. 

అంతే కాకుండా 50 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు, వాటన్నింటిలో మహిళలకు 50 శాతం మహిళలకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఆప్కాస్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 

ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఛైర్మన్లుగా, జేసీలతో కూడిన కమిటీలు పని చేస్తాయి. జిల్లా

ఇంఛార్జ్‌ మంత్రులు రిజర్వేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా చూస్తారు. దీంతో ఎక్కడా అవినీతికి తావుండదన్నారు. 

ఈ ఆప్కాస్‌ చేసే పని. ఉద్యోగులకు ఠంచనుగా గ్రీన్‌ ఛానల్‌ ద్వారా జీతాలు ఇచ్చే కార్యక్రమం. వాటిలో కమిషన్లు, లంచాలు ఉండవు. పద్ధతి ప్రకారం వారికి జీతాలు ఇస్తారు.
ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ క్రమం తప్పకుండా

ఉద్యోగులకు మేలు జరిగేలా చెల్లిస్తారు.
ఈ విధంగా రెండు కేంద్రాల వల్ల ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఎలాంటి కోత లేకుండా జీతాలు వస్తాయి. వివక్ష లేకుండా ఉద్యోగాలు వస్తాయి.
ఆప్కాస్‌ ద్వారా ఇప్పటికే 50,449 మందికి నియామక పత్రాలు ఇవ్వబోతున్నాం.
ఇదో డైనమిక్‌ నెంబరు. ఇది ప్రతి నెల మారుతూ పోతుంది. రాబోయే రోజుల్లో అన్ని

శాఖలు ఈ కార్పొరేషన్‌తో అనుసంధానమవుతాయి. దీంతో ఆ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.

ఈ ఆప్కాస్‌ వల్ల మరో మహత్తర మార్పు ఏమిటంటే.. గతంలో అవసరాని కంటే తక్కువగా సిబ్బందిని నియమించి కాంట్రాక్ట్‌ సంస్థ పని చేయించేది. అదే విధంగా లేని వాళ్లను రికార్డుల్లో చూపించి, వారి జీతం కూడా ఆ సంస్థే తీసుకునేది. ఇక నుంచి అలాంటి

వాటికి తావుండదు. 
ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. భద్రత అనేది మన పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది.
జీతాలు కచ్చితంగా ప్రతి నెలా వచ్చేలా ప్రభుత్వం చూస్తుంది. అందుకోసం కార్పొరేషన్‌ పని చేస్తుంది.
పని చేసే పిల్లలకు మేలు జరగాలని, చేతివాటానికి తావు లేకుండా పూర్తి జీతాలు అందేలా, అన్ని రిజర్వేషన్లు సక్రమంగా అమలు

కావడం కోసం ఆప్కాస్‌ ఏర్పాటు చేస్తున్నాం.
దీని వల్ల మంచి జరుగుతుందని భావిస్తున్నాము.
దీన్ని సక్సెస్‌ చేయడం కోసం కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి
ఈ కార్యక్రమం ద్వారా మంచి జరగాలని, దేవుణ్ని కోరుకుంటూ, ఆప్కాస్‌కు శ్రీకారం చుట్టాం అన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam