DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తప్పు లెటర్ హెడ్ పై షోకాజ్ ఇచ్చారు, అనర్హత వేటు అడ్డుకోండి

*హై కోర్టు లో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాజ్యం.* 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 03, 2020 (డిఎన్ఎస్):* యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైకాపా ) ఇచ్చిన షోకాజ్‌ నోటీసులపై పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు

చేశారు.  తనపై అనర్హత వేటు, సస్పెన్షన్‌ చర్యలు అడ్డుకోవాలని పిటిషన్‌లో కోరారు. ‘‘ఎటువంటి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ లెటర్‌ హెడ్‌పై షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. యువజన శ్రామిక రైతు పార్టీ తరఫున షోకాజ్‌ నోటీసులు ఇవ్వలేదు’’ అని హైకోర్టుకు వేసిన పిటిషన్‌లో

రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా దృష్ట్యా అత్యవసర కేసులు మాత్రమే హైకోర్టు విచారిస్తోంది. రఘురామకృష్ణరాజు పిటిషన్‌ను హైకోర్టు సోమవారం విచారించే అవకాశం ఉంది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam