DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మాజీ మంత్రి రవీంద్ర ప్రమేయంతోనే. .మోకా హత్య

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూలై 04, 2020 (డిఎన్ఎస్):* మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్భలంతోనే వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య జరిగినట్టు కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు మీడియాకు వివరించారు. శనివారం కోర్టు లో ప్రవేశ పెట్టిన క్రమం లో హత్య నేపధ్యం వివరాలు తెలిపారు. రాజకీయపరమైన,

కులపరమైన అధిపత్యపోరులో భాగంగానే పక్కా పథకంతో భాస్కరరావును హతమార్చారన్నారు. నేనున్నా ఏం జరిగినా నేను చూసుకుంటా నా పేరు రాకుండా హతమర్చమని రవీంద్ర ముద్దాయిలను ప్రోత్సహించినట్టు తేలిందన్నారు. రవీంద్ర ప్రోత్సాహంతోనే ముద్దాయిలు భాస్కరరావును హత్య చేశారన్నారు. ఈ కేసులో ఇప్పటికి ఆరుగురిని అరెస్ట్ చేశామని, వీరిలో

ఒకరు కొల్లు రవీంద్ర, కాగా మరొకరు మైనర్ బాలుడు. అత్యవసరమైతే నాకు ఫోన్ చేయకండని, నా పీఎలలోలఎవరికైనా ఒకరికి ఫోన్ చేయండని ఆదేశాలిచ్చినట్టు తెలిసిందన్నారు. హత్య జరగక ముందు కూడా నిందితులు పీఎ ద్వారా రవీంద్రతో మాట్లాడారన్నారు. హత్య జరిగిన పది నిమిషాల తర్వాత నిందితుల్లో ఒకరైన నాంచారయ్య పీఎకు ఫోన్ చేసి రవీంద్రతో

మాట్లాడాడని తెలిపారు. పనైపోయిందని నాంచారయ్య చెప్పగా జాగ్రత్తగా ఉండమని రవీంద్ర వారికి చెప్పారన్నారు. అన్ని రకాలుగా కొల్లు ప్రమేయాన్ని నిర్ధారించుకున్న తర్వాతనే ఆయనకు విచారణ నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వారి ఇంటికి వెళ్లడం జరిగిందని తెలిపారు. అప్పటికే రవీంద్ర పరారవటంతో గాలింపు కోసం మూడు ప్రత్యేక బృందాలను

నియమించామన్నారు. చిలకలపూడి సీఐ వెంకట నారాయణ నేతృత్వంలోని బృందం రవీంద్రను తుని వద్ద అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. విచారణ జరిపి న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam