DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎంతో భాద్యతగా ఉన్నారు: చిన్న జీయర్

*చిన్న జీయర్ స్వామి చే పేదలకు నూతన వస్త్ర బహుకరణ.*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 06, 2020 (డిఎన్ఎస్):* పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎంతో భాద్యతగా ఉన్నారని, ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నారని  ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, శ్రీమదుభయ వేదాంత ఆచార్య

పీఠాధిపతులు, చిన్న జీయర్ స్వామి అభినందించారు. గుంటూరు జిల్లా నడిగడ్డపాలెం లోని శ్రీ వాసుదాసాశ్రమం లో చాతుర్మాస్య దీక్ష అనుగ్రహిస్తున్న సోమవారం ( జులై  6 ) ఉదయం తీర్ధ గోష్ఠి అనంతరం  స్థానిక పేదలకు (మహిళలు, పురుషులకు) అందరికీ నూతన వస్త్రాలు అందించారు. ఆశ్రమ పరిసరాల్లోగల కోలనీ వాసులు మతభేదం లేకుండా వచ్చి

అపరరామానుజులు త్రిదండి చిన్న జీయర్ స్వామి ని  అందరూ దర్శించుకున్నారు. అత్యంత కట్టుదిట్టమైన నిబంధనల మధ్య వచ్చిన ప్రతి ఒక్కరికీ కాళ్ళు కడుక్కునే విధంగా తగిన ఏర్పాట్లు చేసి, అనంతరం ఆశ్రమ ప్రవేశ ద్వారం వద్దే శానిటైజర్ లు అందించి చేతులు పరిశుభ్రం చేకూసునే ఏర్పాటు చేసారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి మరీ రావడం తో

స్వామిజి హర్షం వ్యక్తం చేసారు. అనంతరం ప్రతి ఒక్కరి అత్యంత పరిశుభ్ర వాతావరణం లో ఆహారాన్ని అందించారు. 

స్వామిజి గతం లో ఇదే ఆశ్రమంలో కొన్నాళ్ళు నివసించి తమ ఆచార్యుల వద్ద పలు ప్రబంధాలను అధ్యయనం చేసిన విషయం తెలిసిందే. చిన్న జీయర్ స్వామి తో పాటు  వారి శిష్యులు అహోబిల జీయర్ స్వామి దీక్ష ధారణలో

కొనసాగుతున్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam