DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలవరం పై లెక్కలు కేంద్ర మంత్రి గడ్కరీ వివరిస్తారు :  ఎం పీ హరిబాబు. 

విశాఖపట్నం, జులై 10, 2018  (DNS Online ) : గోదావరి నది పై నిర్మిస్తున్న పోలవరం ప్రోజక్ట్ పై  à°¤à±†à°²à±à°—ుదేశం పార్టీ చేస్తున్న రాద్ధాంతానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ముగింపు

పలుకనున్నట్టు విశాఖపట్నం లోక్ సభ సభ్యులు డాక్టర్ కె హరిబాబు తెలిపారు. మంగళవారం అయన కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ బుధవారం

కేంద్ర జల వనరుల మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా పోలవరం ప్రాజక్ట్ ను పర్యవేక్షించి నున్నారని తెలిపారు. పర్యటన అనంతరం అయన రాత్రికి విశాఖపట్నం చేరుకుంటారని,

పోలవరం పై తెలుగుదేశం పార్టీ చేస్తున్న రాద్ధాంతానికి కేంద్రమంత్రి తగిన సమాధానం చెప్తారన్నారు. పోలవరం ప్రాజక్టు ను జాతీయ ప్రోజక్ట్ గా ప్రకటించామని, దాని

నిర్మాణ బాధత్యలు బీజేపీ పూర్తి చేస్తుందన్నారు. à°ˆ విషయం కేంద్ర మంత్రే స్వయంగా ప్రకటించడం జరిగిందన్నారు. 
 à°‡à°‚తవరకూ పోలవరం పేరిట తెలుగుదేశం పార్టీ చేసిన

హంగామా కు తెర పడుతుందన్నారు. రాత్రికి సాగర తీరం లోని సాయి ప్రియా రిసార్ట్స్ లో జరుగనున్న సమావేశం లో బీజేపీ రాష్ట్ర వ్యాప్త కమిటీలు, ముఖ్య నేతలు, పదాధికారులతో

అయన సమావేశం అవుతారని వివరించారు. ఈ సమావేశం లో పోలవరం పై జరిగిన మొత్తం కదా కమామిషు వివరిస్తారన్నారు. కేంద్రం ఇంతవరకూ పోలవరం నిర్మాణానికి ఎన్ని నిధులు

ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రజలని తప్పుదారి పట్టిస్తోంది దీంతో తేలిపోతుందన్నారు. ఎన్నికల సమయం లో ఆంధ్ర ప్రదేశ్ కు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన

హామీలను అన్నింటినీ తప్పకుండా నెరవేరుస్తున్నామని విశాఖపట్నం లోక్ సభ సభ్యులు డాక్టర్ కె హరిబాబు అన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam