DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆరోగ్యం, నీరు, విద్య తో ప్రజల గుండెల్లోనే. . . .వైఎస్సార్

*ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జి ఎంపీ విజయసాయిరెడ్డి*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 08, 2020 (డిఎన్ఎస్):* ఆరోగ్యం, నీరు, విద్య తో ప్రజల గుండెల్లోనే చిరస్మరణీయం గా నిలిచిన ఏకైక వ్యక్తి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని రాజ్య సభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్

ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జి వి. విజయ్ సాయి రెడ్డి తెలిపారు. బుధవారం వైఎస్సార్ 71 జయంతి ని పురస్కరించుకుని విశాఖ పార్టీ కార్యాలయం లో జరిగిన వేడుకల్లో అయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్య శ్రీ పేరుతొ అత్యంత నిరుపేదలకు సైతం ఉచిత ఆధునిక వైద్యాన్ని, రీజ్ ఏయింబర్సుమెంట్ తో పేదలకు ఉన్నత విద్యను,

జలయజ్ఞం పేరుతొ బీడు భూముల్లో సైతం గంగను ప్రసరింప చేసిన మహనీయుడు ఈయనే అన్నారు. 32 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచడం, 26 లక్షల ఎకరాల అటవీ భూములపై ఆదివాసీలకు హక్కులు కల్పించడం వైయస్ రాజశేఖర్రెడ్డి కే దక్కుతుంది అని కొనియాడారు. 

గతం లో ఎన్నడూ లేని ఈ పధకాలను ప్రత్యక్షంగా అనుభవించిన కోట్లాది మంది ప్రజలు ఆయన్ను తమ

గుండెల్లో నేటికీ పదిలంగా భద్రపరుచుకున్నారన్నారు. 

 వైయస్ జన్మదినోత్సవాన్ని రైతు దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం హర్షదాయకం అన్నారు. వ్యవసాయ రంగానికి ప్రాముఖ్యత ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి అని అన్నారు. అటువంటి ముఖ్యమంత్రి దేశ చరిత్రలో మరొకరెవరూ కనిపించరని పేర్కొన్నారు.

 

కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విఎంఆర్డిఎ చైర్మన్   ద్రోణంరాజు శ్రీనివాస్, శాసన సభ్యులు, సీనియర్ నాయకులూ కొయ్య ప్రసాద్ రెడ్డి, పక్కి దివాకర్,  తదితరులు పాల్గొన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam