DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోవిడ్ నిబంధనలకు లోబడి కనీస దూరం తో విశాఖలో వైభవంగా వైఎస్ జయంతి

*మాస్క్ లు ధరించి, సోషల్ డిస్టెన్స్ తో ఘనంగా వేడుకలు. . .*

*ప్రజలంతా ముఖానికి మాత్రమే మాస్క్ ధరించాలి, డిస్టెన్స్ పాటించాలి*

*సభలో పాల్గొన్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజలకు పిలుపు.* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 08, 2020 (డిఎన్ఎస్):* ప్రజల

గుండెల్లో చిరస్మరణీయునిగా నిలిచి పోయిన దివంగత ముఖ్యమంత్రి డా. వై.యస్. రాజశేఖర రెడ్డి 71వ జ‌యంతి (రైతు దినోత్స‌వం ) విశాఖపట్నం లో వైఎస్సార్ఎం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయ సాయిరెడ్డి, పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ సమక్షంలో వైభవంగా జరిగాయి. 

ఎంతో స్ఫూర్తి గా బీచ్ రోడ్ లో .

.

బుధవారం విశాఖ లో జరిగిన ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ముఖానికి మాత్రమే మాస్కు లు  ( మెడలో కంఠాభరణం లా కాకుండా ) ధరించి మంత్రి, ఎంపీ సహా సామాన్య కార్యకర్తలు సైతం పూర్తి భద్రతా పాటిస్తూ ప్రతి ఒక్కరూ రెండు అడుగుల కనీస దూరం పాటిస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. విశాఖ బీచ్ రోడ్ లోని వైఎస్ విగ్రహం వద్ద నివాళి

సమయంలోనూ, అక్కడే కేక్ కటింగ్ సమయంలోనూ రెండు అడుగుల కనీస దూరాన్ని పాటించడం అత్యద్భుతం.  

అదే స్ఫూర్తిగా నగర పార్టీ కార్యాలయం లోనూ. .. 

నగర కార్యాలయం లో జరిగిన వేడుకల్లో సైతం ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యేలు, నగర సమన్వయ కర్తలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు  ఎంతో స్ఫూర్తిగా

పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం చాలా విశాలంగా ఉండడంతో ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలు ముఖానికి మాత్రమే మాస్క్ లు  ధరించి, ప్రతి ఒక్కరితో రెండు అడుగుల కనీస దూరం పాటించడం అందరికీ చాలా స్ఫూర్తి దాయకంగా నిలిచింది. 

ప్రజలంతా మాస్క్ లు ధరించాలి.. లేకుంటే రూ. 100 ఫైన్ 

ప్రస్తుతం కోవిడ్ 19

విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్క్ లు ముఖానికి మాత్రమే ధరించాలని, కనీస దూరం 2 అడుగులు తప్పనిసరిగా పాటించాలని మంత్రి, ఎంపీలు, నేతలు పిలుపు నిచ్చారు. ప్రజా రక్షణే తమ ప్రభుత్వ ధ్యేయమని, మాస్క్ లను ముఖానికి కాకుండా మెడలో వేసుకున్నా సరే రూ. 100 ఫైన్ చేస్తున్నట్టు తెలిపారు. 

పూర్తిగా కోవిడ్

నిబంధలను పూర్తిగా పాటిస్తూ జరిగిన ఈ వేడుకల్లో నగర పార్టీ అధ్యక్షులు వంశీ కృష్ణ శ్రీనివాస్, వి.ఎం.ఆర్.డి.ఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, శాసన సభ్యులు తిప్పల నాగి రెడ్డి, అన్నం రెడ్డి అదీప్ రాజ్, సమన్వయ కర్తలు కే.కే రాజు, మాజీ శాసన సభ్యులు కుంభా రవిబాబు, తైనాల విజయ్ కుమార్, ఎస్.ఎ. రెహ్మాన్, తిప్పల గురుమూర్తి రెడ్డి ,

 చింతలపూడి వెంకట రామయ్య,  పార్టీ ముఖ్య నాయుకులు చొక్కకాల వెంకట రావు , రవి రెడ్డి , జోన్ వెస్లీ , నగర , జిల్లా అనుబంధ అధ్యక్షులు, వార్డు పార్టీ అభ్యర్ధిలు, పార్టీ వార్డు అధ్యక్షులు తదితరలు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam