DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉత్తరాంధ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది:మంత్రి కన్నబాబు

*గంధవరంలో  గోదాం ప్రారంభంలో వ్యవసాయ మంత్రి కన్నబాబు* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 09, 2020 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. గురువారం నాడు

చోడవరం మండలంలోని గంధవరం గ్రామంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నిర్మించనున్న విత్తన శుద్ధి కేంద్రం మరియు గోదామును  ఆయన, రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు, జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ లతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ

ఆయన ఐదు ఎకరాల స్థలంలో రూ. 4.70 కోట్ల ఖర్చు తో 4000 మెట్రిక్ టన్నుల నిలువ సామర్థ్యం గల గోదామును, విత్తన శుద్ధి కేంద్రాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు.

జిల్లాకు అవసరమైన విత్తనాలనన్నింటిని ఈ కేంద్రం ద్వారా అందించగలుగుతామని తెలిపారు.

విశాఖ జిల్లాకు సాగునీటి వసతి కల్పనకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో

ప్రణాళికలను రూపొందించారని తెలిపారు.

రైతు భరోసా కేంద్రాలు ద్వారా రైతులకు అవసరమైన అన్ని సేవలను, సౌకర్యాలను అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అనకాపల్లి లోక్ సభ సభ్యులు డాక్టర్ బి. సత్యవతి, శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ, కె. భాగ్యలక్ష్మి,  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ మేనేజింగ్

డైరెక్టర్ జి. శేఖర్ బాబు, డి ఈ పైడి రాజు, జిల్లా మేనేజర్ ఎం. శ్రీనివాస్, వ్యవసాయ శాఖ జె.డి లీలావతి, ఏడి శంకర్ రెడ్డి, ఆర్ డి ఓ సీతా రామ రావు, ఎమ్మార్వో రవి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam