DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నర్సాపురం ఎంపి  రాజు పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు 

*భీమవరం ఎంఎల్ఏ ఫిర్యాదుపై రఘురామకృష్ణంరాజు పై  ఫిర్యాదు* 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 09, 2020 (డిఎన్ఎస్):* పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ సభ్యుడు కె.రఘురామకృష్ణరాజుపై భీమవరం పట్టణం లో పోలీస్ కేసు నమోదు అయ్యింది.  కొన్ని రోజులుగా వైఎస్సార్

పార్టీ పై తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్న కనుమూరి రఘురామ కృష్ణరాజుపై గురువారం భీమవరం భీమవరం శాసనసభ్యులు  గ్రంధి శ్రీనివాస్‌ భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో తనతో పాటు సహచర ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మమ్మల్ని రఘురామకృష్ణరాజు 'పందులు' అని అన్నారని,దీనివలన నా పరువుకు నష్టం వాటిల్లేలా

వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు.
కాగా వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఏపీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు రఘురామకృష్ణరాజుపై భీమవరం

వన్ టౌన్ పోలీస్‌ స్టేషన్‌లో వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా ఫిర్యాదు చేశారు.
తన పరువుకు నష్టం వాటిల్లేలా వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తమ పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు. అలాగే, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా రఘురామకృష్ణరాజు

తీరు ఉందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam