DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో విషజ్వరాల విలయతాండవం

*సంతలు లేవు, ఆహారం లేదు, ఆరోగ్యం కూడా లేకుండా పోయింది.*

*మగతపాలెం లో ఎమ్మెల్యే, పాడేరు ఐటిడిఎ పిఓ లు పర్యటించాలి.* 

*ఏపీ వ్యవసాయ వృత్తిదారుల సంఘం కన్వీనర్ కర్త బాలు ఆవేదన*  

*(DNS రిపోర్ట్ : బాలు గాడి, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం ఏజెన్సీ )*

*విశాఖపట్నం ఏజెన్సీ ,  జూలై 09, 2020

(డిఎన్ఎస్):* విశాఖపట్నం జిల్లా జి. మాడుగుల మండలం గడుతూరు పంచాయతీ పరిధి మగతపాలెంలో విషజ్వరాలు విలయతాండవం చేస్తున్నాయని రైతు స్వరాజ్య వేదిక, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ సమన్వయ కర్త బాలు గాడి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజుల్లో సుమారు 150 మంది వరకు ఆదివాసీలు ఈ విషజ్వరాల బారిన పడటం తో పాటు,

గురువారం మరింత విజృంభించడం తో ఆదివాసీలకు ఏమి చెయ్యలేని పరిస్థితి నెలకొంది. 

మండల కేంద్రంలో ఉన్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో 120 మంది వరకు డివిజనల్ కేంద్రం పాడేరు ప్రాంతీయ ఆసుపత్రిలో 30 మంది వరకు ఇప్పటికే జాయిన్ అయ్యారు. పాడేరులో జాయిన్ అయిన వారి ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉందని ప్రాధమిక సమాచారం.

ఇప్పటికే గ్రామంలో క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బంది గ్రామంలో పర్యటించి కారణాలు సేకరిస్తున్నారు. 

తక్షణమే మగతపాలెం గ్రామాన్ని స్థానిక ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్య లక్ష్మి, పాడేరు ఐటిడిఎ పిఓ  లు  సందర్శించాలని కోరుతున్నారు.

గ్రామానికి ఇప్పటికే  ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్
/> మరియు రైతు స్వరాజ్య వేదిక కార్యకర్తలు చేరుకుని రోగ బాధితులను ఆసుపత్రిలకు తరలించడం వారికి సపర్యలు చేయడం మొదలగు కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు.
కరోనా కష్టకాలం ఒకవైపు విషజ్వరాలు ఒకవైపు ఆదివాసీల జీవన స్థితిగతులను అల్లకల్లోలం చేసేసాయి.
ప్రతియేడాది కూడా మలేరియా మరియు టైపాయిడ్ కారణంగా వేలాది మంది ఇబ్బందులు

పడటం, వందలాది మంది మరణించడం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి శాశ్వత పరిష్కారం చూడనంతకాలం ఈ సమస్య పునరావృతం అవుతూనే ఉంటుంది.
కారణాలు ఏవైనా ఆదివాసీలు ఆరోగ్యం అనేది బాహ్య ప్రపంచానికి చీమకుట్టినట్లైన అనిపించకపోవడం చాలా బాధాకరం.

గ్రామాల్లో ఆదివాసీలకు మార్కెట్ పాయింట్ అయినటువంటి వారపు సంతలు కరోనా మహమ్మారి

కారణంగా లేనందున ఆదివాసీల ఆహారానికి అవసరమైన నిత్యవసర సరుకులు అందుబాటులో లేకపోవడం వలన కలుషిత ఆహారం మరియు నిలవ ఆహారాలు తినవలసిన పరిస్థితి నెలకొందన్నారు. 

మారుమూల ఆదివాసీలకు నిత్యవసర సరుకులు ప్రభుత్వం వారానికొకసారి గ్రామాల్లో అందుబాటులో పెట్టాలి. ఒకప్రక్క కరోనా బాధలు, ఇంకో ప్రక్క అనారోగ్య మృత్యువాత

పడుతున్న ఆదివాసీలు, ఆకలి వ్యధలు కూడా చవి చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam