DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళలపై జరుగుతున్న దాడులపై కొరడా ఝుళిపించండి

*డిజిపి ని కల్సిన మహిళా కమిషన్ చీఫ్ వాసిరెడ్డి పద్మ*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 09, 2020 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లో మహిళలపై జరుగుతున్న దాడులపై కఠిన చర్యలు తీసుకుని, దిశా చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చెయ్యాలని ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ

కోరారు. గురువారం రాష్ట్ర డిజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసి మహిళలపై జరుగుతున్న దాడులపై పలు అంశాలను చర్చించారు. అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడుతూ  గతం లో ఎన్నో ఘటనలు జరిగాయని, వాటిపై చర్యలు చట్టప్రకారం తీసుకునే లోగానే గుంటూరులో నగ్న వీడియోలు కేసు మరవకముందే మరో కేసు నమోదు అయ్యిందన్నారు. ఈ విధమైన ఘటనలపై పోలీసులు

చేపట్టవలసిన భాద్యత పై దృష్టి చెప్పాలని డిజీపీని కోరాం అన్నారు. తాము చెప్పిన ఉదంతాలపై డీజీపీ సానుకూలంగా స్పందించారన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం అన్నారు. దిశా యాప్ ను మహిళలు అందరూ ఉపయోగించుకోవాలని తెలిపారు. మహిళ ఉద్యోగులను పై దాడులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సైబర్ నేరాలకు

పాల్పడే వారిపై మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి అని సూచించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam