DNS Media | Latest News, Breaking News And Update In Telugu

15 న రాష్ట్ర మంత్రివర్గ భేటీ, మంత్రిగా తమ్మినేని కి అవకాశం దక్కేనా?

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 10, 2020 (డిఎన్ఎస్):* ఈ నెల 15 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఇటీవల ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ రాజ్య సభకు ఎన్నిక కావడంతో ఆ

పదవులు ఖాళీ అవ్వక తప్పదు. వారి స్థానంలో నూతనంగా ఇద్దరి కి అవకాశం ఇస్తారనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఒక మంత్రి పదవిలో ప్రస్తుత శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం కు ఇస్తారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనికి బలం చేకూర్చే విధంగా తమ్మినేని సీతారాం చర్యలు కూడా ఉండడం గమనార్హం. సాధారణం గా అసెంబ్లీ స్పీకర్ పదవి లో

ఉన్నవారు ప్రభుత్వ పధకాలను ప్రచారం చెయ్యరు. ఆలా ప్రచారం చేసిన దాఖలాలూ గతం లో ఏ ప్రభుత్వ సమయంలోనూ లేవు. అయితే ప్రస్తుతం తమ్మినేని శ్రీకాకుళం జిల్లాలో జరిగే అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ప్రభుత్వ పధకాలను ప్రచారం చెయ్యడం, ప్రతిపక్ష పార్టీలపై విరుచుకు పడడం పరిపాటి గా మారింది. దీంతో పార్టీ వర్గాల్లో వీరికి త్వరలోనే

మంత్రి పదవి వరిస్తుందన్న నిర్ణయం బలపడింది. అయితే పదవి వస్తుందా లేదా అనే విషయం కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచక్షణ పైనే ఆధారపడి ఉంది. 

ఆ రోజున ఉదయం 11 గంటలకు సచివాలయం ఒకటో బ్లాక్​లో మంత్రి వర్గ భేటీ జరగనుంది. దీనిలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
చర్చించాల్సిన అంశాల

ప్రతిపాదనలను సిద్ధం చేయాలని విభాగాధిపతులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 13 సాయంత్రం 5 గంటలలోపు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam