DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రమాదాల నివారణ పరిశీలకై లోకల్ క్రైసిస్ గ్రూప్ ఏర్పాటు

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 10, 2020 (డిఎన్ఎస్):*

శ్రీకాకుళం, జూలై 10: జిల్లాలో ప్రమాదకర రసాయన పరిశ్రమల భద్రత, సురక్షిత అంశాలపై చేపడుతున్న చర్యలను పరిశీలించుటకు లోకల్ క్రైసిస్ గ్రూప్ ( స్ధానిక ప్రమాదాల నివారణ పరిశీలన బృందం) ను జిల్లా కలెక్టర్ జె నివాస్ ఏర్పాటు

చేసారు. ఈ బృందం రెవిన్యూ డివిజనల్ అధికారి అధ్యక్షతన పనిచేస్తుంది. ఇందులో భాగంగా శుక్ర వారం రెవిన్యూ డివిజనల్ అధికారి ఎం.వి.రమణ అధ్యక్షతన ఆర్.డి.ఓ కార్యాలయంలో సమావేశమైంది. కర్మాగారాల చట్టము, కర్మాగారాల చట్టాలకు అనుబంద చట్టాలైన మానుఫ్యాక్చర్ స్టోరేజి, ఇంపోర్ట్ ఆఫ్ హజార్డస్ కెమికల్స్ రూల్స్, కెమికల్ ఆక్సిడెంట్

రూల్స్ తదితర చట్టాలకు అనుగుణంగా కర్మాగారాలు తీసుకున్న చర్యలను పరిశీలిస్తుంది. ఈ బృందానికి కర్మాగారాల తనిఖీ అధికారి సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఈ బృందంలో సభ్యులుగా అగ్నిమాపక అధికారులు, పోలీసు అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు,  అరబిందో ఫార్మా లిమిటెడ్, ఆంధ్రా

ఆర్గానిక్స్ లిమిటెడ్, స్మార్ట్ కెమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఎన్.ఏ.సి.ఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, డా.రెడ్డీ లేబొరేటరీస్ లిమిటెడ్, స్వచ్చంధ సంస్ధల ప్రతినిధిగా ఆర్ట్స్ ఎన్‌జి‌ఓ, ఇద్దరు వైద్యులు, ఇద్దరు కెమికల్ ట్రాన్సుపోర్టర్లు, ఇద్దరు సోషల్ వర్కర్లు ఉంటారు. కెమికల్ ఎమర్జెన్సీ జరిగినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,

ప్రజలలో చైతన్యం తీసుకురావటం కోసం అవగాహన సధస్సుల నిర్వహణపై  సభ్యులు ప్రధాన చర్యలు చేపడతారు. 
    ఈ సందర్భంగా ఆర్.డి.ఓ ఎం.వి.రమణ మాట్లాడుతూ ఫ్యాక్టరీలలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. మాక్ డ్రిల్ లో క్రైసిస్ సభ్యులు, ప్రభావిత ప్రాంతాల ప్రజలను బాగస్వాములను చేయాలని సూచించారు. పైడి

భీమవరం ప్రాంతంలో క్రైసిస్ గ్రూప్ కొరకు ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. 
డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జి.వి.వి.ఎస్.నారాయణ మాట్లాడుతూ  లోకల్ క్రైసిస్ గ్రూప్ ఆవశ్యకతను వివరించారు. 
 కర్మాగారాల తనిఖీ అధికారి మరియు సభ్య కార్యదర్శి పైడి చిన్నరావు మాట్లాడుతూ

 సభ్యుల  మధ్య సమన్వయం, అత్యవసర పరిస్ధితుల్లో ఎదుర్కోవలసిన జాగ్రత్తలు గురించి వివరించారు. 
క్రైసిస్ బృందం సభ్యులు ఎన్.సన్యాసి రావు మాట్లాడుతూ ప్రభావిత ప్రాంతాలలో గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు పౌర రక్షణ (సివిల్ డిఫెన్స్), రెడ్ క్రాస్ ద్వారా శిక్షణ కల్పించి ప్రజల్లో తగు అవగాహన చర్యలు చేపట్టవచ్చని

సూచించారు. 
ఈ సమావేశంలో ఎచ్చెర్ల అగ్నిమాపక ఇన్స్పెక్టర్ శ్రీను బాబు, రణస్థలం అగ్నిమాపక అధికారి పోలినాయుడు, డాక్టర్ రెడ్డీ లాబ్ ప్రతినిధి డా.సుమన్, సామాజిక కార్యకర్తలు డి.విజయ్ కుమార్, సౌమ్య, సి.హెఛ్ .అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam