DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అరసవల్లి హుండీ ఆదాయం రూ. రూ. 24,90,245 /- 

*బంగారం 44 గ్రా,  వెండి 1570 గ్రా. మొక్కుబడులు.*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 10, 2020 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర లో ప్రముఖమైన ఆలయం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి హుండీలను రెండవ రోజు లెక్కించగా 8,40,344/- రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో వి. హరి సూర్య

ప్రకాష్ తెలిపారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు అనివెట్టి మండపం లో కోవిడ్  19 నిబంధనలు పాటిస్తూ లెక్కింపు ప్రారంభించామన్నారు. కేవలం 40 మందితో  లెక్కింపు జరిపామని తెలిపారు. అలాగే బంగారం 10 గ్రాములు, వెండి 650 గ్రాములు వచ్చిందని పేర్కొన్నారు. 
రెండు రోజుల లెక్కింపు తర్వాత  మొత్తం ఆదాయం. రూ. 24,90,245 /-

లభించిందని, 

మొదటి రోజు ఆదాయం . రూ. 16,49,901 రూపాయలు, రెండవరోజూ ఆదాయం : రూ. 8,40,344/-  వచ్చిందని, 

బంగారం  మొత్తం  44 గ్రాముల 200 మిల్లి గ్రాములు, వెండి 1570 గ్రాములు లభించింది. మొదటి రోజు బంగారం 34 గ్రాముల 200 మిల్లి గ్రాములు, వెండి 920  గ్రాములు, రెండవరోజు  బంగారం 10 గ్రాములు, వెండి 650 గ్రాములు లభించిందని ఈఓ తెలిపారు.

 

మొత్తం 134 రోజుల ఆదాయం ఇది: 

ఫిబ్రవరి  25 నాడు హుండీ లోని ఆదాయం లెక్కించడం జరిగిందని, తదుపరి ఆదాయం లెక్కింపు జులై 9 న జరిపినట్టు తెలిపారు. మొత్తం 134 రోజుల హుండీ ల ( లాక్ డౌన్ కాలం తో కలుపుకుని) లెక్కింపు జరిగిందని ఈఓ తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాలక మండలి చైర్మన్ ఇప్పిలి జోగి సన్యాసి రావు, ఆలయ

ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, పాలక మండలి సభ్యులు మండవల్లి రవి, మండల మన్మథరావు , యమజాల గాయత్రి , దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ జీ. ప్రసాద్ బాబు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam