DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉద్యోగం మాలీ. . . వెలగబెట్టేది హమాలీ (వాహకుడు). సేవేనా . .

*సింహగిరి పై వ్యవహారమంతా మాలీ కనుసన్నల్లోనే . .నా  .?*

*కదిలే ప్రతి కాగితం లోనూ ఇతని ప్రమేయం తప్పదా?*

*(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 11, 2020 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్యదైవమైన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి ఆలయం పరిధిలో జరిగే అధికారిక,

అనధికారిక కార్యక్రమాల్లో ఒక సాధారణ మాలీ చక్రం త్రిప్పుతున్నాడంటే అతిశయోక్తి కాదు. ఏళ్ళ కాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నా, గత మూడేళ్ళుగా ఇతని చేతిలోని చక్రం చాలా వేగంగా తిరుగుతోందని ఆలయ సిబ్బందే వాపోతున్నారు. క్రింది స్థాయి ఉద్యోగుల నుంచి, ఉన్నత స్థాయి అధికారుల వరకూ ఏ చిన్న కదిలిక వచ్చిన ముందు తలిచే పేరు ఈ మాలీదే.

ఇటీవల సింహగిరిపై జరిగిన పలు అవకతవకలపై దేవాదాయ శాఖా ప్రతినిధిగా చంద్రశేఖర్ ఆజాద్ ప్రత్యక్షంగా పర్యటించి ఇచ్చిన నివేదికలో కొందరు ఆలయ ఉద్యోగులకు సస్పెండ్ చెయ్యమని ఆదేశాలు వచ్చి నెలదాటినా  నేటి వరకూ ఆ ఆదేశాలపై కదలిక లేదంటే. . ఇతని ప్రభావమే. . . పై స్థాయిలో జరిగే లావాదేవీలను సైతం తృటిలో సెటిల్ చెయ్యగల శక్తిమంతుడు ఈ

మాలీ. . . దేవస్థానం లో ఉద్యోగం ఇచ్చింది మాలీ హోదా అయితే ఇతని తన పలుకుబడి, మంత్రుల వద్ద ప్రాపకం వినియోగించి ఏనాడు చీపురు పట్టుకోవాల్సిన అగత్యం లేకుండా చేసుకోగలిగాడు. పైగా ఇతని హోదా తెలిసిన అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నత స్థాయి అధికారులు సైతం కొన్ని సందర్భాల్లో ఇతని సహకారం కోరతారంటే అతిశయోక్తి కాదు. 

రాజకీయ

పలుకుబడి ప్రధాన కారణం :. . . .

ఒక మాలీ స్థాయి ఉద్యోగికి ఈ స్థాయిలో పలుకుబడి ఉందంటే దానికి ప్రధాన కారణం రాజకీయ ప్రాపకం మాత్రమే. గత తెలుగుదేశం ప్రభుత్వం లోనూ, ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనూ ఇతని హవా నడుస్తోంది అంటే ఇతను ఏ స్థాయిలో ప్రాపకం పెంచుకున్నాడో తెలుస్తోంది. 

సాక్షాత్తు మంత్రులు, ఇతర విఐపీలు ఆలయ

దర్శనానికి వస్తున్నారంటే ముందుగా వెళ్లే ఫోన్ కాల్ ఈ మాలీ కే కావడం విశేషం. ఇతని ద్వారానే ఈఓ కి కూడా తెలుస్తుందంటే. .. మంత్రులు సైతం ఇతనికి ప్రాధాన్యం ఇస్తున్నారని దేవస్థానం ఉద్యోగులే బహిరంగంగా విమర్శలు చేస్తుంటారు. 

కదిలే ప్రతి కాగితమూ ఇతని ఖాతాలోకే. . .

దేవస్థానము లో కదిలే ప్రతి కాగితమూ ఇతని

ఖాతాలోకే వెళ్తోందనేది బహిరంగ రహస్యం. దీనికి నిదర్శనమే ఇటీవల అర్చకుల పై వచ్చిన ఫిర్యాదులను స్తబ్దత చేకూర్చడానికి అందిన తాంబూలం ఐదుకు పై మాటే. . . ఇలా అయ్యవార్ల పైనే అజమాయిషీ చేస్తున్నాడంటే. . . అధికారులు ఒక లెక్కా అనే వైఖరితోనే ఉన్నట్టు తెలుస్తోంది. దేవస్థానం లో జరిగిన, జరుగుతున్న ప్రతి కుంభకోణం లోనూ ఇతని వేలు

కచ్చితంగా ఉంటుందన్నది అందరి విశ్వాసం.   

కొండ పై అక్రమం గా  గ్రావెల్ తవ్వకాల నుంచి, అర్చకుల అంతర్గత వివాదాలు, భూ ఆక్రమణల్లో నిర్మాణాలు, ఇలా అన్ని స్థాయిల్లోనూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో  కీలక పాత్ర ఇతనిది కావడం గమనార్హం. ఈ విషయాన్నింటినీ గమనించిన ఆజాద్ ఇతనిపై సైతం పూర్తి నివేదిక దేవాదాయ శాఖకు

ఇవ్వడం జరిగింది. యధాప్రకారంగా మంత్రుల ప్రాపకం తో పూర్తిగా మసిపూసి మారేడు చేసేసిన ఘనత సింహాచల దేవస్థాన సూపర్ ఈఓ దే. 

ఇతనిపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తే తమ సీటుకే ఎసరు వస్తుందేమో అనే అనుమానం లో అధికారులు ఉన్నారా అనే అనుమానాలూ సిబ్బందిలో వస్తున్నాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam