DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళం సిటీ లో కూడా లాక్ డౌన్ లో ప్రజలు తిరగరాదు

*1 గంట తర్వాత తిరిగితే చర్యలు:  జిల్లా కలెక్టర్ డా. నివాస్. ..* 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 11, 2020 (డిఎన్ఎస్):* శ్రీకాకుళం పట్టణం లో కూడా లాక్ డౌన్ అమలు లో ఉందని, ఒంటి గంట తరువాత ప్రజలు కూడా తిరిగరాదని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఈ మేరకు శని వారం ఒక ప్రకటన

విడుదల చేస్తూ శ్రీకాకుళం పట్టణంలో శుక్ర వారం నుండి లాక్ డౌన్ అమలు చేస్తున్నామన్నారు. ఇచ్ఛాపురం, పలాస పట్టణాల్లోనూ లాక్ డౌన్ అమలు అవుతందని ఆయన పేర్కొన్నారు. లాక్ డౌన్ పట్టణాల్లో  ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే దుకాణాలు తెరచుటకు అనుమతించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఒంటి గంట తరువాత ప్రజలు కూడా

తిరిగరాదని ఆయన స్పష్టం చేసారు. కరోనా కేసులు పెరుగుతున్న సంగతి ప్రతి ఒక్కరికీ విదతమేనని అన్నారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పలు పట్టణాల్లో లాక్ డౌన్ ప్రకటించగా, కొన్ని ప్రాంతాల్లో స్వచ్చందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రోజు రోజుకు తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు బయట తిరగ రాదని

అన్నారు. ప్రజలు విధిగా విధిగా మాస్కులు ధరించాలని, అత్యవసర సమయాల్లో బయటకు వచ్చే వారు భౌతిక దూరం పక్కాగా పాటించాలని ఆయన స్పష్టం చేసారు. తరచూ సబ్బుతో లేదా శానిటైజర్ తో చేతులు శుభ్రపరచుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సూచనలు ప్రతి ఒక్కరూ విధిగా  పాటించాలని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడా వేడుకలు

నిర్వహించరాదని, ఎక్కడా రద్దీ ఉండరాదని తెలిపారు. 

లక్షణాలు ఉంటే పరీక్షలకు రండి : 
కరోనా లక్షణాలు ఉన్న లేదా కరోనా అని అనుమానం ఉన్నా పరీక్షలకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఫీవర్ సర్వే జరుగుతోందని, ఇంటికి వచ్చే ఆరోగ్య కార్యకర్తలు, ఎ.ఎన్.ఎంలకు సహకరించి వివరాలు అందించాలని అన్నారు. కరోనా వివక్ష

ఉంటుందని ప్రాణాల మీదకు తెచ్చుకోరాదని, కరోనా వివక్ష చూపించే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతోందని అన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam