DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సచిన్ ధాటికి రాజస్థాన్ కూడా చే జారి పోతుందా. . . ?

*సంక్షోభం లో రాజస్థాన్ (కాంగ్రెస్) ప్రభుత్వం.*

*తిరుగు బావుటా ఎగరేసిన సచిన్ పైలట్* . . 

*దేశ రాజధానిలో 30 మంది MLA లతో శిబిరం*   

*మంత్రులను రాజీనామా చెయ్యమన్న సీఎం అశోక్ గెహ్లాట్.*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 12, 2020 (డిఎన్ఎస్):* దేశ ప్రజల

నమ్మకం కోల్పోయిన కాంగ్రెస్ చేతి లో నుంచి రాజస్థాన్ కూడా జారీ పోయే పరిస్థితి వచ్చేసింది. ఆ రాష్ట్రానికి చెందిన యువ నేత సచిన్ పైలట్ ( రాజేష్ పైలట్ కుమారుడు) తిరుగుబాటు బావుటా ఎగుర వేయడంతో ప్రస్తుతం రాజస్థాన్ లో అధికారం లో ఉన్న అశోక్ గెహ్లాట్ ( కాంగ్రెస్ ) ప్రభుత్వం కూలిపోనుంది. గత కొన్ని నెలలుగా అసంతృప్తిగా ఉన్న సచిన్

పైలట్ ను బుజ్జగించే ప్రయత్నం కాంగ్రెస్ అధిష్టానం చెయ్యక పోగా, కనీసం ఖాతరు కూడా చెయ్యక పోవడంతో శనివారం తిరుగుబాటు జండా ఎగురవేసి, తనకి అనుకూలంగా ఉన్న 30 మంది ఎమ్మెల్యే లతో కలిసి దేశ రాజధాని ఢిల్లీ చేరుకొని అక్కడే ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసారు. 

ఆదివారం జరిగిన రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ల సమావేశంలో

ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన ప్రభుత్వం నిలబడే అవకాశాలు లేనందున, తక్షణం తన మంత్రివర్గ సహచరులను రాజీనామా చెయ్యమని ఆదేశించారు. సోమవారం గెహ్లాట్ కూడా రాజీనామా చేసే అవకాశాలున్నాయి. విషయం కాంగ్రెస్ అధిష్టానానికి చేరడంతో ఒక బిస్కెట్ వేసినట్టు సచిన్ పైలట్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రకటించింది. ఎట్టి

పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని సచిన్ తేల్చడంతో రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే స్థితి వచ్చేసింది. 
అయితే ప్రస్తుతం రాజకీయ సంక్షోభం లో ఉన్న ప్రభుత్వం స్వతంత్ర ఎమ్మెల్యేలను కూడదీసుకుని ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam