DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అనంత పద్మనాభుని భాద్యత ట్రావెన్కోర్ రాజవంశానిదే, సుప్రీం

*పద్మనాభ ఆలయ ఆస్తుల భాద్యత పై సుప్రీం కోర్టు తీర్పు వెల్లడి* 

*ట్రావెన్ కోర్ రాజా వంశ యువరాణి ఆస్వతి తిరుణాల్ కన్నీటి పర్యంతం*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం / న్యూఢిల్లీ, జూలై 13, 2020 (డిఎన్ఎస్):* ప్రపంచంలోనే అత్యధిక ఆస్తులు కల్గిన కేరళ రాష్ట్ర రాజధాని

తిరువనంతపురం లోని ప్రఖ్యాత అనంత పద్మనాభస్వామి ఆలయం నిర్వహణ భాద్యతలు ట్రావెన్‌కోర్‌ రాజకుటుంబానిదే నని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. గత కొన్ని శతాబ్దాలుగా ఈ ఆలయ నిర్వహణ, సంప్రదాయాలను ఈ రాజ వంశమే కొనసాగిస్తోంది. వీరి పూర్వికులు తమ యావదాస్తిని ఈ స్వామికే రాసి ఇచ్చేసారు. వీళ్ళు

కేవలం సేవకులుగా భాద్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఆలయ ఆదాయం, ఆస్తులపై కన్ను వేసిన కేరళ ప్రభుత్వం, దీన్ని ఎలాగైనా హస్తగతం చేసుకుని ఆదాయాన్ని స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో కోర్టు లో కేసు వేసింది. ప్రభుత్వానికి అనుకూలంగా కేరళ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో, దీన్ని ఖండిస్తూ రాజకుటుంబం సుప్రీం కోర్టు ను

ఆశ్రయించింది. 

హిందూ సంప్రదాయాన్ని వ్యతిరేకించే కమ్యూనిస్టుల పాలనలో ఉన్న కేరళ ప్రభుత్వం ప్రపంచం లోనే అత్యధిక సంపద ఉన్న పద్మనాభ స్వామి ఆలయాన్ని స్వాధీనం చేసుకోవాలని కోర్టు లో కేసు వెయ్యడాన్ని హిందూ సమాజం పూర్తిగా తప్పు పట్టింది. హిందూ  సంప్రదాయాలపై విలువ లేని పాలకులు, హిందూ దేవాలయ ఆస్తులపై ఎలా

హస్తగతం చేసుకుంటారని, భక్తులు మండిపడుతున్నారు. ఈ క్రమం లోనే సుప్రీం కోర్టు తీర్పు అందరికి ఊరట కల్గించింది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam