DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అష్ట దిగ్బంధం లో రాజమహేంద్రవరం: కమిషనర్ అభిషిక్త్

 *ఉదయం 11 గంటల తర్వాత వ్యాపార కేంద్రాలు మూసివేత * 

*ప్రజా సంచారంలో రూల్స్ తప్పితే కఠిన చర్యలు తీసుకుంటాం.*
 
*కంటెంట్మెంట్ జోన్లు పై ప్రత్యేక దృష్టి, వైద్య పరీక్షలు పెంచాలి* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 13, 2020 (డిఎన్ఎస్):* తూర్పుగోదావరి జిల్లా ప్రధాన

కేంద్రమైన రాజమహేంద్రవరం మంగళవారం నుంచి అష్టదిగ్బంధం లోకి వెళ్ళిపోనుంది. ఉదయం 6 గంటల నుంచి 11 వరకే అన్ని వాణిజ్య కేంద్రాలు, నిత్యావసరాలు తెరిచి ఉంటాయని, తదుపరి పూర్తిగా ప్రభుత్వ పరిధిలోకి వెళ్ళిపోతుందని రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్,  మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషిక్త్  కిషోర్

ప్రకటించారు. 

రాజమహేంద్రవరం నగరం, రూరల్ పరిధిలో కోవిద్ 19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డివిజన్లోని వైద్యాధికారులు, పోలీస్ అధికారులు, మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు, ఏపీ పేపర్ మిల్స్, ఫుడ్ కార్పొరేషన్, హార్లిక్స్ ఫ్యాక్టరీ,  వ్యాపార సంస్థ ల ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులుతో కార్పొరేషన్ కార్యాలయంలో

సోమవారం కమిషనర్ అభిషిక్త్  కిషోర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిద్  నివారణకు ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్యాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోవిద్ సందేహాలు ఉన్నవారి పట్ల శ్రద్ధ వహించాలని ఆదేశించారు. రాజమహేంద్రవరం రూరల్,  సిటీ పరిధిలో వైద్య సిబ్బంది ని పెంచి, అవసరమైతే ఇతర విభాగాల

డాక్టర్లను సిబ్బందిని సమన్వయం చేస్తూ  క్షేత్రస్థాయిలో ఉపయోగించాలని, ఎక్కువ టీమ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఆక్సిజన్ లెవెల్స్ 94 కంటే తక్కువ ఉన్న వారికి మాత్రమే పరీక్షలు చేయాలని, ఫీవర్ క్లినిక్ లు పెంచాలన్నారు. కంటోన్మెంట్ జోన్ల పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. హెల్త్ సెంటర్ ల పనితీరుపై

సమీక్షించారు.

రూల్స్ తప్పితే కఠిన చర్యలు తప్పవు :. . .

నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు సూచిస్తూ వాహనదారులు విషయంలో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మాస్క ధరించని  వారిపై, సామాజిక దూరం పాటించని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ పేపర్ మిల్,

హార్లిక్స్ ఫ్యాక్టరీ, ఎఫ్ సి ఐ ప్రతినిధులతో వారు చేపడుతున్న చర్యలపై సమీక్షించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే లారీ ల డ్రైవర్లు విషయంలో జాగ్రత్తలు వహించాలని, లోడింగ్ అన్ లోడింగ్ సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఎఫ్సీఐ జట్టు మేస్త్రీలుకు అవగాహన కల్పించాలన్నారు.

ఈ సమావేశంలో అర్బన్ జిల్లా ఎస్పీ

షిమోషి వాజపేయి మాట్లాడుతూ కోవిద్ 19 చర్యల్లో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు నటించని వారిపై, మాస్కులు ధరించని వారిపై చర్యలు తీవ్రతరం చేశామన్నారు. ఈ సమావేశంలో ఎడిషనల్ కమిషనర్ ఎన్  వి వి సత్యనారాయణ, సి పి వరప్రసాద్, మేనేజర్ శ్రీనివాస్, ఎడిషనల్ డి ఎం & హెచ్ ఓ డాక్టర్ కోమల, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జ్యోతి కుమారి,ఎం  హెచ్ వో లు

డాక్టర్ విన్నూత్న, డాక్టర్ మూర్తి,  డీఎస్పీలు సంతోష్, రవికుమార్, వెంకట్రావు, చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ ఎం మురళి, ఏపీ పేపర్ మిల్ అధికారులు, ఎఫ్ సి  ఐ  అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam