DNS Media | Latest News, Breaking News And Update In Telugu

Lady cop questions son of Minister on lockdown violations ,lost job

*అభినందించాల్సిన అధికారులు ఆగ్రహిస్తే. . రాజీనామా చేసింది.*

*ఇలాగ డిపార్ట్మెంట్ కి ఒక్కళ్ళు ఉంటె చాలు, రాష్ట్రం బాగుపడుతుంది*

*సూరత్ లో మహిళా కానిస్టేబుల్ ధైర్యానికి నెటిజన్లు అభినందన* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 14, 2020 (డిఎన్ఎస్):* లాక్ డౌన్

నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించిన ఒక మంత్రి కొడుకును అడ్డుకుని ప్రశ్నించిన కారణంగా ఒక మహిళా కానిస్టేబుల్ ఉద్యోగాన్ని కోల్పోయిన ఘటన సూరత్ లో జరిగింది.  ప్రస్తుతం గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ అధికారం లో ఉంది. 

సూరత్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఈమె పేరు సునీతా యాదవ్.  ప్రస్తుతం లాక్ డౌన్

నిబంధనలు అమలవుతున్న తరుణంలో ఈ నెల 9 వ తేదీ రాత్రి 10 :30 గంటల రాతి వేళల్లో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ తిరుగుతున్నా ఒక కారును అపి, ప్రయాణీకులను ప్రశ్నించారు. రూల్స్ కు విరుద్ధంగా ఈ కారులో బలాదూర్ గా తిరుగుతున్నా వ్యక్తి గుజరాత్ ఆరోగ్యమంత్రి కుమార్ కానాని కొడుకు ను ఉన్నాడు. అతను ముఖానికి మాస్క్ కూడా ధరించాక పోవడం, తో

పాటు నిబంధనలు ఉల్లంఘించారు. ఈ కారులో మరో నలుగురు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసింది. మంత్రి ఫోన్ చేసినా ఖాతరు చేయలేదు. కారుకున్న ఎమ్మెల్యే స్టిక్కర్ పీకించింది. మంత్రితో ఆమె మాట్లాడిన వీడియో ఆమె నీతికి, నిజాయితీకి, నిర్భీతికి నిదర్శనం.

ఈమె నిజాయితీ కి మద్దతు గా నిలవాల్సిన

ఉన్నతాధికారులు సైతం ఈమెనే తప్పు పట్టడం తో పాటు ఆమెను వేరేచోటకి బదిలీ చెయ్యడంతో ఆమె సహించలేక పోయింది. దీంతో మరునాడు ఉదయాన్నే రాజీనామా చేసి, తక్షణం విధుల నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపింది. 

ప్రతి రాష్ట్రంలోనూ ఒక్కో ప్రభుత్వ శాఖలోనూ ఇలాంటి నిజాయితీ గల ఉద్యోగి ఒక్కరంటే చాలని, మొత్తం రాష్ట్రం

బాగుపడుతుందని, నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఆమె మంత్రి తో మాట్లాడిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam