DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బడి వయసు పిల్లలు పనిలో ఉండరాదు, డిజిపి గౌతమ్

*రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ తో పిల్లలకు రక్షణ* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 14, 2020 (డిఎన్ఎస్):*  బడి వయసు పిల్లలు ఉండవలసింది బడిలోనే తప్ప, పనిలో ఉండకూడదని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆపరేషన్

ముస్కాన్ కోవిడ్ 19 కార్యక్రమం ద్వారా వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న బడి వయసు పిల్లలను రక్షించి, వారి సంరక్షణ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి జిల్లాలోనూ వారం రోజుల పాటు ఉదయం 5 గంటల నుంచే ఈ కార్య్కచరణ మొదలవుతుందన్నారు. వాణిజ్య వ్యాపార సముదాయాల్లోను, టిఫిన్ కేంద్రాల్లోనూ, ఇతర క్రయ విక్రయ కేంద్రాల్లోనూ, ఇళ్లలోనూ, తదితర

ప్రాంతాల్లో పనిచేసే బాల బాలికలకు ఆ పనుల నుంచి విముక్తి కల్గించడం జరుగుతుందన్నారు. 
బాలల ముఖము లో చిరునవ్వులు పూయించడమే లక్ష్యంగా వారికి స్వేచ్ఛను కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగమే ఆపరేషన్‌ ముస్కాన్‌. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడమే లక్ష్యంగా

ప్రవేశపెట్టిన ఆపరేషన్‌ ముస్కాన్‌ కోవిడ్‌-19 కార్యక్రమాన్ని మంగళవారం ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ కంట్రోల్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. దేశంలోనే మొదటసారిగా ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19కు శ్రీకారం చుట్టామన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam