DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మొదటి సారిగా పరీక్షలు లేకుండా పాస్ జీవో విడుదల

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 14, 2020 (డిఎన్ఎస్):* కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నెలలో జరగవలసిన పదవ తరగతి పరీక్షలను రద్దు చేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అందరూ ఉత్తీర్ణులైనట్టుగా ప్రకటించింది. మంగళవారం దానికి సంబంధించిన జీవో ను

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్బంగా రాష్ట్ర విద్య శాఖామంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ విద్య విధానంలో కొంత ఒడుదుడుకులు వచ్చిన మాట వాస్తవమేనని, అయితే విద్యార్థులు అత్యున్నత భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని, పరీక్షలను పలు మార్లు వాయిదా వేయడం జరిగిందన్నారు. ఇక పరీక్షలు నిర్వహించే అవకాశం లేదని తేలిన తదుపరి

అందరిని పాస్  చేస్తున్నట్టు ప్రకటించామన్నారు. విద్య శాఖా బోర్డులో పదవతరగతి పరీక్ష విధానం ప్రారంభమైన నాటి నుంచి దరఖాస్తు చేసిన వారందరూ పాస్ అవ్వడం ఇదే తొలిసారి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam