DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు

*ప్రజా రవాణా వ్యవస్థ పై సమీక్ష జరిపిన ఎంపీ మార్గాని*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 14, 2020 (డిఎన్ఎస్):*  కరోన ఉదృతి నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థలో భాగమైన ఎపిఎస్‌ఆర్‌టిసిలో కరోన భద్రతా చర్యలు మరింత పగడ్భంధీగా నిర్వహించాలని ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ ఆదేశించారు.

మంగళవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని తన కార్యాలయంలో ఆర్టీసీ ఉన్నతాధికారుతో ఆర్టీసీ కరోన భద్రతా చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోన ఉదృతి ఎక్కువగా ఉన్న క్రమంలో మరింతగా భద్రతా చర్యులు తీసుకోవాలని ఆదేశించారు. శానిటేషన్‌ నిర్వహించిన తరువాత ప్రయాణికులను చేరవేసేలా చర్యులు

 తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కరోన నిబంధనల ప్రకారం ప్రయాణికులకు భద్రత కల్పించి భౌతిక దూరాన్ని పాటించేలా చర్యలను ఖచ్చితంగా పాటించాలని అన్నారు. టిక్కెట్టు కౌంటర్ల వద్ద కూడా భౌతిక దూరాన్ని ప్రయాణికులు పాటించేలా అధికారులు  చర్యులు  తీసుకోవాలని అన్నారు. ప్రస్తుతం ప్రయాణికుల  సంఖ్య, నడుస్తున్న సర్వీసులు ,

బస్సుల్లో తీసుకుంటున్న జాగ్రత్తులు , తదితర అంశాలపై ఆయన సూక్ష్మంగా సమీక్షించి తగుసూచనలను, సలహాలను చేశారు. ఆర్టీసీ డిపోలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అభివృద్ధి దిశగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ప్రభుత్వ పరంగా చేయాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి, ఆర్టీసీ ప్రిన్సిపాల్ సెక్రటరీ

 కృష్ణబాబు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు  మాట్లాడుతూ తొమ్మిది వేల  నుంచి 11 వేల  మంది వరకూ రాజమండ్రి డిపో నుంచి ప్రయాణాలు  సాగిస్తున్నారని, సాధారణ రోజుల్లో 25 వేల  నుంచి 26 వేల  మంది వరకూ ప్రయాణికుల  రవాణా ఉండేదని వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో ఈడి రవికుమార్‌, ఆర్‌ఎం

నాగేశ్వరరావు, డిఎం మూర్తి, తదితరులు  పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam