DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19 పటిష్టంగా అమలు చెయ్యాలి

*పెట్రోలింగ్ వాహనాల ప్రారంభం లో శ్రీకాకుళం ఎస్పీ అమిత్*  
 
*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 14, 2020 (డిఎన్ఎస్):* శ్రీకాకుళం జిల్లా లో ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19  ను పటిష్టంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ అమిత్ బర్డర్ తెలిపారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఈ

కార్యక్రమానికి ఏర్పాటు చేసిన పెట్రోలింగ్ వాహనాలను అయన  జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అనాదరణ కు గురైనటువంటి వీధి బాల బాలికలు కోవిడ్ బారిన పడకుండా మరియు వేధింపులు, అక్రమ రవాణాకు గురికాకుండా, ముఖ్యముగా పారిశ్రమిక వాడలో మరియు చిన్న చిన్న పరిశ్రమలు పనిచేసే  నిరాధారణ లేని బాలబలికాలను

 సంరక్షణ చర్యలు చేపట్టేందుకు ఈ ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19 కార్యక్రమం ఈ రోజు తే14 నుండీ 20 వరకు వారం రోజుల పాటు జిల్లాల్లో రెండు బృందాలుగా ఏర్పడి పనిచేయదురు. ఈ విభాగాల అధికారులు, సిబ్బంది సబ్ డివిజన్ స్థాయిలో బృందాలుగా ఏర్పడి  వీధుల్లో తిరుగుతున్న వీధి బాల బాలికలను గుర్తించనున్నారు. ఈ బృందాలులో పోలీసు (A.H. T. U.),

కార్మికశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, జువైనల్ వెల్ఫేర్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు స్వచ్ఛంధ సంస్థలు సంయుక్తంగా ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించడం జరుగుతుంది. అనంతరం పై అన్ని విభాగాల అధికారులు మరియు సిబ్బంది తో  కలిసి వాహనాలును జిల్లా ఎస్పీ గారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సంబంధిత

విభాగాలకు చెందిన జిల్లా అధికారులు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కరోనా వేళ అత్యంత జాగ్రత్తలు తీసుకునేలా సూచనలు చేశారు. రెస్క్యూకు వెళ్లే బృందాలు స్వీయ జాగ్రత్తలు తీసుకుంటూనే బాలలు పట్ల కూడా జాగ్రత్తలు చేపట్టాలి. మాస్కులు, ఫేస్ షీల్డులు ధరించాలి. శానిటైజర్లు వినియోగించాలి. సామాజిక దూరం పాటిస్తూ

బృందాలు రెస్క్యూ చేయాలన్నారు. 
ఈ ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19 కార్యక్రమాన్ని నిర్వహించే సమయంలో ఆ కార్యక్రమంలో పాల్గొనే పోలీస్ మరియు ఇతర అధికారులు అందరికీ ముందుగా కరోనా టెస్టులు నిర్వహించిన తర్వాతనే పొలగ్నాలిని. కరోనా వేళ పిల్లలు ఇబ్బందిపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని...పిల్లలకు కరోనా పరీక్షలు నిర్వహించిన

అనంతరం రిజల్ట్ వచ్చేంత వరకు బాలల సంరక్షణ కేంద్రాల్లో పిల్లల్ని ఉంచాలి. ఆ తర్వాత చైల్ద్ వెల్ఫేర్ కమిటీలచే తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు అప్పగించాలని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుని సమిష్టి కృషితో ఈ ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19 ను విజయవంతం చేయాలని సూచించారు. 

ఈ కార్యక్రమం లో అదనపు

ఎస్పీ  పి. సోమశేఖర్ (పరిపాలనా), సి.డబ్ల్యు.సి చైర్ పర్సన్, నరసింహమూర్తి, డి.సి.పి.ఓ   కె. వి. రమణ , ఐ.సి.డి.ఎస్ డిపార్ట్మెంట్ నుండి కె నాగమణి, లేబర్ డిపార్ట్మెంట్ నుండి పురుషోత్తం, స్టేట్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్, నోడల్ కోఆర్డినేటర్ (చైల్డ్ లైన్)  సింహాచలం,  సీసీఎస్ సి.ఐ శ్రీనివాసరావు, డి.సి.ఆర్.బి, సి. ఐ . గోవిందరావు మరియు

ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam