DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సంచార సంజీవిని వాహనాన్ని సద్వినియోగం చేసుకోవాలి

*రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ పిలుపు.* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 15, 2020 (డిఎన్ఎస్):*  కోవిద్ 19 టెస్టులు సులభతరం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంచార సంజీవని బస్సు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం

పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్ రామ్ పిలుపునిచ్చారు. బుధవారం రాజమహేంద్రవరం చేరుకున్న సందర్భంగా  ఈ బస్సును బుధవారం నాడు స్థానిక సుబ్రహ్మణ్య మైదానం ఆనం కళాకేంద్రం వద్ద ఎంపీ, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషి క్త్  కిషోర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ రామ్ మీడియాతో

మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కోవిద్ 19 టెస్ట్ కోసం రూపొందించిన సంచార సంజీవిని వాహనం ద్వారా ప్రతి ఒక్కరూ పరీక్షలు నిర్వహించుకుని  తోటివారి శ్రేయస్సు, కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సహకరించాలని అన్నారు. ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లాకు మూడు బస్సులను కేటాయించగా రాజమహేంద్రవరం పరిధిలోఒక బస్సు ద్వారా

ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, అర్ధ గంట సమయంలో పరీక్షా ఫలితాలు ఇవ్వగలరన్నారు. రాజమహేంద్రవరం పరిధిలోని ఈ వాహనం ద్వారా రోజుకి 1000 పరీక్షలు  చేయవలసిందిగా ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయన్నారు. రాజమహేంద్రవరం తూర్పు,  పశ్చిమ గోదావరి జిల్లాలకు ఒక వ్యాపార కూడలి  గా ఉందని, నేషనల్ హైవే కలుపుకోవడం వలన, ఆర్టీసీ నుండి రోజుకు

11 వేల నుండి 12 వేల వరకు ప్రయాణికులు రాజమండ్రిలోని దిగడం వలన,  అదేవిధంగా ప్రధాన రైళ్లు రాజమండ్రిలో ఆగడం వలన కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. 
 రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ అభిషి క్త్ కిషోర్ మాట్లాడుతూ కోవిద్ పరీక్షల కొరకు ఏర్పాటుచేసిన  సంచార సంజీవిని

రాజమహేంద్రవరం నగరం, రూరల్ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉంటుందని, డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ రూరల్ పరిధిలోని, ఎం హెచ్  సిటీ పరిధిలోని ఒక ప్రోగ్రాం ప్రకారం అందుబాటులో ఉంచుతారు అన్నారు. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు ప్రజలు మార్కెట్ నిర్వహించుకోవాలని, 11 గంటల అనంతరం తమ ఇళ్ళలో ఉంటూ ప్రభుత్వాన్ని సహకరించాలన్నారు. ఈ

కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఎన్  వి వి సత్యనారాయణ, కార్పొరేషన్ మేనేజర్ శ్రీనివాస్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిల  సమన్వయ అధికారి డాక్టర్ టి రమేష్ కిషోర్,  డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ కోమల, ఎం హెచ్ ఓ డాక్టర్ విన్నూత్న,  ఆర్టీసీ ఆర్ ఎం నాగేశ్వర రావు, డి ఎం సత్యనారాయణ మూర్తి, కాను బోయిన సాగర్, అర్బన్ హెల్త్ సిబ్బంది,

 వాలంటరీ లు ఉన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam