DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పలాస రాజన్న సీదిరి కు మంత్రి పదవి దాదాపు ఖరారే. . .

*డాక్టర్ కావడంతో వైద్య శాఖా అప్పగించే అవకాశం. .*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 15, 2020 (డిఎన్ఎస్):* మాటకారి, ప్రజలను ఆకట్టుకునే తీరు కల్గిన శ్రీకాకుళం జిల్లా పలాస శాసన సభ్యులు వృత్తి రీత్యా వైద్యులు అయిన డాక్టర్ సీదిరి అప్పలరాజు కు మహర్దశ పట్టి రాష్ట్ర

క్యాబినెట్ లో మంత్రి పదవి వరించనుంది. ఇటీవల మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోసులు రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఖాళీ అయిన రెండు మంత్రి పదవులకు కొత్త వారి పేర్లు దాదాపు ఖరారు అయ్యాయి.  వీటిల్లో ఒక స్థానం పలాస రాజన్నగా పేరుపొందిన అప్పలరాజుకు లభించడం ఖాయంగానే కనిపిస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్

రెడ్డి సైతం సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈయన స్వతహాగా డాక్టర్ కావడం, ఇటీవల కరోనా విషయంలో అప్పలరాజు స్థానికంగా తీసుకున్న చర్యలు సీఎంను ఆకర్షించాయి.

అదే విధంగా మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పేర్లను సీఎం జగన్ ఖరారు చేసినట్టు సమాచారం. రెండు మంత్రి పదవుల్లో ఒకటి శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సిదిరి

అప్పలరాజు కు కేటాయిస్తారని సమాచారం.  కేబినెట్ లోకి తీసుకుంటే అప్పలరాజుకు వైద్య ఆరోగ్య శాఖ అప్పగించవచ్చు. 

పిల్లి సుభాష్ చంద్ర బోస్ తో ఖాళీ అయిన స్థానాన్ని శెట్టి బలిజ వర్గానికి చెందిన రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ  కు ఇవ్వనున్నారు. పిల్లి సుభాష్ కూడా శెట్టి బలిజ సామాజిక వర్గం

వారే.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam