DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అరసవల్లి సూర్య దేవాలయ అర్చకులకు కరోనా పరీక్షలు

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 15, 2020 (డిఎన్ఎస్):* కోవిడ్ 19 వైరస్ మహమ్మారి వ్యాప్తి నిరోధంలో  భాగంగా శ్రీకాకుళం జిల్లా శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో పనిచేస్తున్న అర్చకులకు పరీక్షలు నిర్వహించారు. బుధవారం ఆలయ ప్రసాద వితరణ కేంద్రం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు

చేసిన వైద్య శిబిరంలో అర్చకులు కనీస దూరం పాటిస్తూ, పద్దతిగా ఒక్కొక్కరుగా వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్బంగా సూర్య దేవాలయ ఆలయ కార్యనిర్వహణ అధికారి వి. హరి సూర్యప్రకాష్, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ మాట్లాడుతూ ఆలయ అర్చకులు సంప్రదాయ బద్దంగా ఎంత శ్రద్దగా ఆరాధనలో పాల్గొంటారో అంటే శ్రద్దగా వైద్య

పరీక్షలకు కూడా హాజరై అందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. గత మూడున్నర నెలలుగా ఆలయ ప్రాంగణం లో ప్రపంచ శాంతి కోరుతూ సూర్య ఉపాసన, ఆదిత్య హోమం, జపతపాదులు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమం లో రెవిన్యూ డివిజనల్ అధికారి ఎం.వి.రమణ పర్యవేక్షణలో తహశీల్దారు దిలీప్ చక్రవర్తి, వైద్య అధికారులు డా.అప్పరావు, లింగరాజు వర్మ తదితరులు

పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam