DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహచల గోశాల లో గోమాత ల జీవనం దుస్థితి మహా దుర్భరం

*హైందవేతరులు పాలకులైతే. . .అథో గతి. . .: వి హెచ్ పి* 

*ముస్లిం లకు ఆలయం లో విధులు ఎలా ఇచ్చారు?: బిజెవైఎం*  

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 16, 2020 (డిఎన్ఎస్):*ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్యదైవమైన శ్రీవరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం పరిధిలోని గోశాలలో ఉన్న

గోమాతల జీవనం అతి దుర్భరంగా తయారయ్యింది. బుధవారం పాత, కొత్త గోశాల లోని గోవులను సంరక్షించేందుకు విధుల్లో ఉన్న 31 మంది తాత్కాలిక సిబ్బందిని అర్దాంతరంగా తొలగించడంతో, గోవులను సంరంక్షించే వారు లేక పోవడంతో వాటి పరిస్థితి చాల దుర్భరంగా మారింది. వీటిల్లో పాతగోశాలలో ఉన్న కొన్నింటికి దూడలు పుట్టడం తో వాటిని సాకే వారు కూడా

లేకపోవడం గమనార్హం. దశాబ్ద కాలం నుంచి శ్రద్దగా పని చేస్తున్న తాత్కాలిక సిబ్బందిని తొలగించి, కొండపై పారిశుధ్య కార్మికులకు గోశాలలో విధులు కేటాయించడం తో వాళ్ళు చేతులెత్తేసి, ఇవి మాకు లొంగవు అనే వెనక్కి వెళ్లిపోవడంతో అధికారులు, చైర్మన్ తీసుకున్న నిర్ణయానికి 250 గోవులు ప్రస్తుతం అష్టకష్టాలు పడుతున్నాయి. వాటి ఆలనా

పాలనా పట్టించుకునే వాడు లేక అసలు పాలు పితికే వాళ్ళు లేక, పేడ ఎత్తేవారు లేక, గడ్డి, చిట్టు , తవుడు పెట్టేవారు లేకపోవడంతో గోవులు ఎంతో ఆర్తిగా చూస్తున్నాయి. 

హైందవేతరులు పాలకులైతే. . .అథో గతి. . .: వి హెచ్ పి 

హిందూ సంప్రదాయాలపై గౌరవం లేని వాళ్ళు చైర్మన్ లు గాను, అధికారులను రావడం వల్లే హిందూ సమాజానికి ఈ

దుస్థితి వచ్చిందని విశ్వహిందూ పరిషత్ సభ్యులు మండిపడుతున్నారు. వందల కోట్ల రూపాయల విలువ కల్గిన సింహాచలం గోశాలలోని భూములను కొందరు ప్రజా ప్రతినిధులు దోచిపెట్టే ప్రక్రియ లో గొపాలకులను ఉద్యోగం నుంచి తొలగించారన్నారని విశ్వహిందూ పరిషత్ సభ్యులు మండిపడుతున్నారు. ముందుగా ఉద్యోగులను తొలగిస్తే, తర్వాత గోవులను బయటకు

పంపిస్తే తద్వారా భూములను ఇతరులకు ధారాదత్తం చెయ్యవచ్చని పధకం వేశారన్నారు. 

*ముస్లిం లకు ఆలయం లో ఉద్యోగం ఎలా ఇచ్చారు?: బిజెవైఎం*  

 హిందువుల ఆరాధ్య దేవాలయం సింహాచలం గోశాలలో పనిచేసేవారు తప్పకుండా హిందూ ధర్మాన్ని పాటించేవారినే విధుల్లో నియమించాల్సి ఉండగా, ముస్లిం లకు ఉద్యోగం ఎలా ఇచ్చారని

భారతీయ జనతా పార్టీ యువమోర్చ నగర అధ్యక్షుడు ఫణింద్ర దేవాలయ ఈఓ ను ప్రశ్నించారు. ఇటీవల తొలగించిన 31 మంది ఉద్యోగుల్లో కొందరు ముస్లింలు కూడా ఉన్నారన్నారు. గోమాతను పూజించే ప్రాంగణంలో వాళ్లకు ఉద్యోగం ఇచ్చి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. సింహాచల ఉద్యోగుల్లో సైతం క్రైస్తవ మతాన్ని అవలంభించే వారు కూడా

ఉండడం హిందువుల దురదృష్టం అన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam