DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఒక్క కారులోనే రూ. 5 కోట్లు దొరికితే. . మిగిలిన వాటిలో ఎంతో ?

*బాలినేనిని మంత్రివర్గం నుంచి తొలగించాలి: మాజీ ఎంపీ తోట*  

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 16, 2020 (డిఎన్ఎస్):* చెన్నైలో నివాసం ఉంటున్న వైఎస్ భారతి బంధువు సుధాకర్ రెడ్డికి చేర్చేందుకు ఆ డబ్బు తరలిస్తున్న ఘటనపై రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ని  తక్షణం

మంత్రివర్గం నుంచి వెంటనే తొలగించాలని, దీనిపై ఆరోపణల పై లోతైన విచారణ జరగాలని పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం ఇంచార్జి, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి డిమాండ్ చేసారు. గురువారం ఈ ఘటన పై స్పందిస్తూ పోలీసుల తనిఖీలో రూ. 5.27 కోట్లు పట్టుబడినందున ఈ కేసు ఈడికి అప్పజెప్పాలన్నారు. పట్టుబడిన వారు మంత్రి అనుచరులే అని ఒంగోలు లో

తెలియనిది ఎవరికి అని ప్రశ్నించారు. పారిపోయిన మంత్రి తనయుడిని వెంటనే పట్టుకోవాలన్నారు. మంత్రి కుమారుడికి అతిసన్నిహితంగా ఉండే ముఖ్య అనుచరుడు నల్లమిల్లి బాలు పట్టుబడ్డ విషయం వాస్తవం కాదా?,  హవాలా ద్వారా వేల కోట్లు రూపాయలు తరలించిన వైనంపై సమగ్ర విచారణ జరగాలన్నారు.  మంత్రి వర్గీయులకు చెందిన ఒక్క వాహనాన్ని

పెట్టుకుంటేనే రూ 5 కోట్లు దొరికాయని, ఇలా మిగిలిన వాహనాల్లో ఎంత తరలించారు? ఈ విధంగా ఎన్ని సార్లు తరలించారనున్నారు. 

మంత్రి అనుచరుడు పట్టుబడ్డారని, డ్రైవర్లు,  గుమస్తా లు కూడా వారి మనుషులే నన్నారు.  పోలీసులకి పట్టుబడిన టీ.ఎస్.66 ఈ 1166 అనే కారుకు మంత్రి బాలినేని కి చెందిన స్టికర్ ఉందని, నల్లమిల్లి బాలు మంత్రి

కి ఆయన కుమారుడికి ముఖ్య అనుచరుడు ఇతను వైసిపి పార్టీ నుండి ఒంగోలు నగర వాణిజ్య విభాగం అధ్యక్షుడు గా స్థానిక సంస్థల ఎన్నికలకు ఒంగోలు కార్పొరేషన్ లోని 25 వ డివిజన్ నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీలో సైతం ఉన్నారన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam