DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోరక్షణ కు అండగా నిలిచిన మంత్రి వెల్లంపల్లి కి ధన్యవాదాలు

గోశాల కొనసాగింపు పై దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి ఆదేశాలు 

DNS మీడియా ఏజెన్సీ ప్రతినిధులకు ప్రత్యేక కృతఙ్ఞతలు 

బీజేపీ రాష్ట్ర ఈసీ సభ్యులు, న్యాయవాది డా. కెవివి సత్యనారాయణ 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 16, 2020 (డిఎన్ఎస్):* సింహాచల

దేవస్థానం లోని గోశాల కొనసాగిస్తూ, పాత ఉద్యోగులను కొనసాగించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీసుకున్న నిర్ణయంపై ఆయనకు ధన్యవాదములు తెలియచేస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, న్యాయవాది డా. కెవివి సత్యనారాయణ తెలిపారు. గోమాత ను హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తుంటారని, అలాంటి

గోమాత కు నీడ లేకుండా చేస్తున్నారంటే చాల బాధకల్గిందన్నారు. దీనిపై సానుకూలంగా పరిష్కారం చూపించాలనే సంకల్పం తోనే ఉద్యమించడం జరిగిందన్నారు. దీనిలో ఎవరి మనోభావాలు దెబ్బతీసే ప్రక్రియ లేదన్నారు. లక్షలాది నిధులు వెచ్చించి దాతలు విరాళం ఇచ్చిన గోవులను సైతం తరలించే ప్రయత్నం దారుణమన్నారు. 

గోమాత సురక్షం గా

ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. అది ఆవేదన చెందితే అది మానవాళికి మంచిది కాదన్నారు. ఈ విధమైన చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా మారే ఇతర దేవాలయంలో కూడా జరుగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ని అయన కోరారు. ఈ ఉద్యమంలో సహకారం అందించిన DNS మీడియా ప్రతినిధులకు కృతఙ్ఞతలు తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam